యాప్నగరం

వరల్డ్ బ్యాడ్మింటన్ నుంచి శ్రీకాంత్ ఔట్

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించాలన్న స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కల నెరవేరలేదు.

TNN 25 Aug 2017, 5:43 pm
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించాలన్న స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కల నెరవేరలేదు. శుక్రవారం గ్లాస్గోలో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. కొరియాకు చెందిన ప్రపంచ నెం.1 సన్‌ వాన్‌ హో చేతిలో రెండు వరస సెట్లలో ఓడిపోయాడు. రెండో సెట్‌లో హోరాహోరీగా పోరాడినా ఫలితం లేకపోయింది. తొలి గేమ్‌ను చేజార్చుకున్న కిదాంబి.. రెండో గేమ్‌లో పుంజుకొని మంచి ఆటతీరును కనబరిచినప్పటికీ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో 14-21, 18-21 తేడాతో పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
Samayam Telugu world badminton championships kidambi srikanth loses in quarter finals
వరల్డ్ బ్యాడ్మింటన్ నుంచి శ్రీకాంత్ ఔట్


ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఓపెన్‌లలో వరసగా టైటిళ్లను సొంతం చేసుకున్న శ్రీకాంత్ తనపై అంచనాలను పెంచేశాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో శ్రీకాంత్‌కు పతకం ఖాయమనే అనుకున్నారంతా. కానీ శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌లోనే వెనుదిరగడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. శ్రీకాంత్ నిష్క్రమణతో ఇప్పుడు దృష్టంతా పీవీ సింధు, సైనా నెహ్వాల్‌పైనే ఉంది. మహిళల సింగిల్స్‌లో వీరిద్దరూ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. గత కొంతకాలంగా పీవీ సింధు అద్భుతంగా రాణిస్తోంది. గాయాలతో సతమతమైన సైనా నెహ్వాల్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. మరి వీరిద్దరిలో ఎవరు పతకం తెస్తారో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.