యాప్నగరం

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్‌లో అద్భుత ప్రదర్శన

Samayam Telugu 4 Aug 2018, 7:51 pm
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సింధు ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీలో భాగంగా జపాన్ క్రీడాకారిణి యమగూచితో శనివారం సెమీస్‌లో తలపడిన సింధు వరుస సెట్లలో 21-16, 24-22 తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో ఈ తెలుగు తేజం ఢీకొననుంది. ఇప్పటి వరకు ఒక్క భారత షట్లర్ కూడా ఈ టోర్నీలో పసిడి పతకం గెలవలేదు.
Samayam Telugu world championships sindhu beat yamaguchi to enter final
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన సింధు


ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌‌కి ఇప్పటి వరకు ఆరు పతకాలు వచ్చాయి. ఇందులో పీవీ సింధునే మూడు గెలవగా.. సైనా నెహ్వాల్ రెండు, ప్రకాశ్ పదుకొణె ఒక పతకం గెలిచారు. తాజాగా ఫైనల్‌కి చేరిన సింధు బంగారు పతకం గెలిస్తే.. ఈ టోర్నీలో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలనుంది. ఇప్పటికే టోర్నీ నుంచి సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌ తదితర స్టార్ షట్లర్లు పేలవ ఓటములతో నిష్క్రమించగా.. సింధు మాత్రమే పతకం రేసులో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.