పారాలింపిక్స్లో పతక విజేతలకు ఒలింపిక్స్ పతక విజేతలతో సమానంగా నగదు బహుమతి అందిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ తెలిపారు. పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ విన్నర్ కు రూ.75 లక్షలు, సిల్వర్ మెడల్ విన్నర్ కు రూ.50 లక్షలు, బ్రౌంజ్ విన్నర్ కు రూ.30 లక్షలు అందిస్తామన్నారు. రియో డి జనీరోలో నేటి నుంచి ఈ నెల 18 వరకు పారాలింపిక్స్ జరగనున్నాయి. ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 17 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. పారాలింపిక్స్లో భారత్ కు తొలి స్వ ర్ణ పతకాన్ని అందించిన దేవేంద్ర జాజారియా (జావెలిన్ త్రో, ఏథెన్స్ 2004) ఈ బృందంలో ఉన్నాడు.
పారాలింపిక్స్ పతక విజేతలకూ బిగ్ ఫ్రైజ్ మనీ
పారాలింపిక్స్లో పతక విజేతలకు ఒలింపిక్స్ పతక విజేతలతో సమానంగా నగదు బహుమతి అందిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ తెలిపారు.
TNN 7 Sep 2016, 2:47 am