రియో పారాలింపిక్స్ లో భారత్ అథ్లెట్లు తంగవేలు, వరుణ్లు దుమ్ము రేపారు. హైజంప్లో ఇద్దరు వరుసగా బంగారు, కాంస్య పతకాలతో రికార్డు సృష్టించారు. టీ-42 హైజంప్ ఈవెంట్లో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్ల హై జంప్ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. అటు ఇదే ఈవెంట్లో భారత మరో అథ్లెట్ వరుణ్ సింగ్ భటి 1.86 మీటర్లు హై జంప్ చేసి కాంస్య పతకాన్ని గెలుకున్నారు. కాగా, పారాలింపిక్స్ బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన వారికి వరసగా రూ.75 లక్షలు, రూ.50 లక్షలు, రూ.20 లక్షలు ఇవ్వాలని కేంద్ర క్రీడల శాఖ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
తంగవేలు హై జంప్ చూడండి..
తంగవేలు హై జంప్ చూడండి..