యాప్నగరం

పారాలింపిక్స్‌లో భారత్‌కు బంగారు, కాంస్య పతకాలు

రియో పారాలింపిక్స్‌ లో భారత్ అథ్లెట్లు తంగవేలు, వరుణ్‌లు దుమ్ము రేపారు.

TNN 10 Sep 2016, 9:25 am
రియో పారాలింపిక్స్‌ లో భారత్ అథ్లెట్లు తంగవేలు, వరుణ్‌లు దుమ్ము రేపారు. హైజంప్‌లో ఇద్దరు వరుసగా బంగారు, కాంస్య పతకాలతో రికార్డు సృష్టించారు. టీ-42 హైజంప్ ఈవెంట్‌లో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్ల హై జంప్ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. అటు ఇదే ఈవెంట్‌లో భారత మరో అథ్లెట్ వరుణ్ సింగ్ భటి 1.86 మీటర్లు హై జంప్ చేసి కాంస్య పతకాన్ని గెలుకున్నారు. కాగా, పారాలింపిక్స్‌ బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన వారికి వరసగా రూ.75 లక్షలు, రూ.50 లక్షలు, రూ.20 లక్షలు ఇవ్వాలని కేంద్ర క్రీడల శాఖ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu india wins gold and bronze at rio paralympics
పారాలింపిక్స్‌లో భారత్‌కు బంగారు, కాంస్య పతకాలు


తంగవేలు హై జంప్ చూడండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.