యాప్నగరం

రియో ​​పారాలింపిక్స్: జావెలిన్ త్రోలో స్వర్ణపతకం

రియో ​​పారాలింపిక్స్ లో మనం మరో స్వర్ణం సాధించాం. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్ లో దేవేంద్ర ఝఝారియా గోల్డ్ మెడల్ సాధించారు.

TNN 14 Sep 2016, 2:57 pm
రియో ​​పారాలింపిక్స్ లో మనం మరో స్వర్ణం సాధించాం. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్ లో దేవేంద్ర ఝఝారియా గోల్డ్ మెడల్ సాధించారు. దేవేంద్ర 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ 62.15 మీటర్ల దూరం విసిరి జావెలిన్ ఈవెంట్ లో బంగారు పతకాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. కాగా రియో పారాలింపిక్స్ లో 63.97 మీటర్ల దూరం విసిరి మరో సారి రికార్డు స్రుష్టించాడు. ఈ ముప్పై ఆరేళ్ల అథ్లెట్ జావెలిన్ త్రోలో ప్రస్తుతం ప్రపంచంలో మూడో ర్యాంక్ లో ఉన్నాడు. దేవేంద్ర పాటు భారతదేశానికి చెందిన రింక్ హుడా, సుందర్ సింగ్ గుర్జార్ ఈ ఈవెంట్ లో పోటీలో ఉన్నారు. కాగా రింక్ 54.39 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచారు. సుందర్ సింగ్ గుర్జార్ ఇంకా ఈవెంట్ లో పాల్గొనలేదు. కాగా పారాలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం మొత్తం నాలుగు పతకాలను సాధించింది. రాజస్థాన్ కు చెందిన ఈ అథ్లెట్ 2004లో అర్జున అవార్డు, 2012 లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డులు అందుకున్న మొదటి పారాలింపియన్ దేవేంద్ర కావడం విశేషం. దేవేంద్ర ఎనిమిది ఏళ్ల వయసున్నప్పుడు ఒక చెట్టు ఎక్కే క్రమంలో విద్యుక్ షాక్ కు గురయ్యాడు. దీంతో తన ఎడమ చేతిని కోల్పోవాల్పి వచ్చింది. 2013లో లియాన్ లో ఇంటర్నేష్నల్ పారాలింపిక్ కమిటీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఈయన సాధించిన గోల్డ్ మెడల్ ఈ ఈవెంట్‌లో భారత్‌కు మొదటిది కావడం విశేషం.
Samayam Telugu rio paralympics javelin thrower devendra jhajharia wins gold
రియో ​​పారాలింపిక్స్: జావెలిన్ త్రోలో స్వర్ణపతకం


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.