యాప్నగరం

పారాలింపిక్స్‌ కొలనులో భారత చేప జాదవ్!

స్విమ్మింగ్‌పై ఆసక్తి ఉన్న ఓ కుర్రాడు చిన్నప్పటి నుంచే ఈత ప్రాక్టీస్ మొదలెట్టాడు. కరెంట్ షాక్ కొట్టడంతో అతడు చేతులు కోల్పోయాడు. కానీ మనోధైర్యాన్ని మాత్రం కాదు.

TNN 6 Sep 2016, 5:39 pm
ఓ ప్రమాదంలో 15 ఏళ్ల క్రితం రెండు చేతులు కోల్పోయిన ఓ యువకుడు పారాలింపిక్స్‌లో ఈత కొలనులో పోటీకి బరిలోకి దిగుతున్నాడు. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న పారాలింపిక్స్‌లో భారత్ తరఫున 22 ఏళ్ల సుయాష్ జాదవ్ పాల్గొంటున్నాడు. 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రియో బరిలో ఉన్న ఏకైక భారత స్విమ్మర్ అతడే కావడం విశేషం. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన జాదవ్ తండ్రి కూడా జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అతడి అడుగు జాడల్లో ప్రయాణం మొదలు పెట్టిన సుయాష్ చిన్నతనం నుంచే స్విమ్మింగ్‌పై ఆసక్తిని పెంచుకున్నాడు. కానీ ఆరోతరగతి చదువుతున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టడంతో మోచేతుల వరకూ అతడి రెండు చేతులనూ తొలగించారు. నాటి నుంచి టీనేజీలోకి అడుగుపెట్టే వరకూ తల్లిదండ్రులే తనకు అన్నం తినిపించే వారని, టీనేజ్‌కి వచ్చాక తన పనులు తానే చేసుకోమని వారు సూచించేదాకా తనకు చేతుల అవసరమే తెలిసిరాలేదని సుయాష్ తెలిపాడు. దీంతో కాసేపు నిరాశకు లోనైనప్పటికీ, రోజువారీ పనులను తానే చక్కబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాని చెప్పాడు.
Samayam Telugu suyash jadhav is the only one indian swimmer is particpating in rio paralympics
పారాలింపిక్స్‌ కొలనులో భారత చేప జాదవ్!

‘ఒక రోజు తల్లిదండ్రులతో కలిసి గుడికి వెళ్లిన సమయంలో కోనేరులోకి దిగి ఈత కొట్టాలనే కోరిక కలిగింది. తల్లిదండ్రులు గుడి లోపల ఉండగా, అంకుల్‌తో ఈ విషయం చెబితే.. ఆయన వద్దని వారించాడు. కానీ నేను మాత్రం కోనేటిలోకి దూకి ఈత కొట్టాను. నాటి నుంచి నా జీవన ప్రయాణం మరింత అందంగా మారింది’ అని జాదవ్ చెప్పుకొచ్చాడు. గతేడాది రష్యాలో జరిగిన ఐడబ్ల్యూఏఎస్ వరల్డ్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన జాదవ్, పోలిష్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ పారాలింపిక్స్‌లోనూ అతడు పతకంతో తిరిగి వస్తాడని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ సుయాష్ జాదవ్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.