యాప్నగరం

తంగవేలుకి మరో అరుదైన గౌరవం

పారాలింపిక్స్‌లో టీ-42 హై జంప్ కేటగిరీలో భారత్‌కి స్వర్ణం సాధించిపెట్టి, ఈ క్రీడల్లో దేశం పేరు నిలబెట్టిన తంగవేలు...

Samayam Telugu 12 Sep 2016, 5:37 pm
పారాలింపిక్స్‌లో టీ-42 హై జంప్ కేటగిరీలో భారత్‌కి స్వర్ణం సాధించిపెట్టి, ఈ క్రీడల్లో దేశం పేరు నిలబెట్టిన తంగవేలు మరియప్పన్‌కి మరో అదురైన గౌరవం లభించింది. తమిళనాడుకి చెందిన తంగవేలు పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత జాతీయ పతాకాన్ని చేతపట్టి ఇండియన్ స్వ్కాడ్‌ని ముందుండి నడిపించనున్నాడు. దేశం తరపున పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఎంతోమంది కోరుకునే అరుదైన అవకాశం ఇది.
Samayam Telugu thangavelu mariyappan to be the flag bearer at the closing ceremony
తంగవేలుకి మరో అరుదైన గౌరవం


సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ పారాలింపిక్స్ పోటీలు సెప్టెంబర్ 18న ముగియనున్నాయి. దాదాపు 160కిపైగా దేశాలకి చెందిన మొత్తం 4350 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 22 రకాల క్రీడల్లో, 528 మెడల్స్ ఈవెంట్లలో ఈ అథ్లెట్లు పోటీపడనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.