యాప్నగరం

ఎత్తుకెళ్లిన ఫోన్లు పని చేయవు..!

చోరీగాళ్లు ఎన్ని ఏషాలేసినా ఆ ఫోన్లు పని చేయవు. ఇక వాటిని చెత్త కుప్పలో పడేయడమే దిక్కు. సెల్ ఫోన్లను చూస్తే చిత్తు కాగితాల్లా భావించే రోజులు..

TNN 8 Jul 2017, 7:47 pm
చిల్లర దొంగలకు పంచ్.. చోరీకి గురైన, పొరపాటున పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు పూర్తిగా సర్వీస్ నిలిపేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కొత్త వ్యవస్థ ప్రకారం.. ఎత్తుకెళ్లిన సెల్ ఫోన్లలో సిమ్‌ కార్డులు, ఐఎమ్‌ఈఐ సంఖ్యలను మార్చినా పని చేయకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వరంగ టెలికామ్‌ దిగ్గజం ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ పుణేలోని కేంద్రంలో ప్రాజెక్టు చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ఆర్నెళ్లలోగా ఫలితాలను అందిస్తుందని టెలికామ్‌ విభాగం వర్గాలు తెలిపాయి. సీఈఐఆర్‌ అనే ఈ కొత్త వ్యవస్థ కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.
Samayam Telugu stolen and lost mobile phones will not work
ఎత్తుకెళ్లిన ఫోన్లు పని చేయవు..!


మొబైల్‌ ఆపరేటర్ల ఐఎమ్‌ఈఐ డేటాబేస్‌లకు ఓ కేంద్రీయ వ్యవస్థలా సీఈఐఆర్‌ పని చేస్తుంది. చోరీకి గురైన, పోగొట్టుకున్న ఫోన్ల ఐఎమ్‌ఈఐలను ఇది సేకరిస్తుంది. ఆ తర్వాత సిమ్‌లు మార్చినా నిర్ధారించుకొని.. సదరు ఫోన్లను పని చేయకుండా చేస్తుంది. అంటే చోరీగాళ్లు ఎన్ని ఏషాలేసినా ఆ ఫోన్లు పని చేయవు. ఇక వాటిని చెత్త కుప్పలో పడేయడమే దిక్కు. సెల్ ఫోన్లను చూస్తే చిత్తు కాగితాల్లా భావించే రోజులు రానున్నాయన్నమాట.

ఒకవేళ ఎవరైనా నకిలీ ఐఎమ్‌ఈఐని సృష్టించి కళ్లు గప్పాలని చూసినా వాళ్ల పప్పులు ఉడకవని, సీఈఐఆర్‌ అలాంటి చర్యలను ఇట్టే పసిగడుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఐఎమ్‌ఈఐ సంఖ్యను మార్చడాన్ని శిక్షార్హమైన నేరంగా గుర్తించి.. మూడేళ్ల కారాగార శిక్ష కూడా విధించేలా నిబంధనలు ప్రవేశ పెట్టనున్నట్లు టెలికామ్‌ శాఖ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.