యాప్నగరం

రైనా ఆటోగ్రాఫ్ కోసం.. ఫ్యాన్ సాహసం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆటోగ్రాఫ్‌ల కోసం మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ఇప్పటికే అభిమానులు వచ్చారు

TNN 11 May 2017, 5:12 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో తొలిసారి మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చిన కాన్పూర్‌లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరుగుతుండగా భద్రతా వలయాన్ని ఓ అభిమాని ఛేదించుకుని ఫీల్డింగ్ చేస్తున్న సురేశ్ రైనా దగ్గరకి వచ్చేశాడు. ఊహించని ఈ ఘటనతో రైనా తొలుత కంగారు పడినా.. అనంతరం అభిమానితో కరచాలనం చేసి వెంటనే మైదానాన్ని వీడాల్సిందిగా సూచించాడు. అప్పటికే భద్రతా అధికారులు కూడా సమీపిస్తుండటంతో అతను మైదానం నుంచి వెనుదిరిగాడు. ఆ అభిమాని సురేశ్ రైనా తరహాలోనే గుజరాత్ లయన్స్ జట్టు జెర్సీని వేసుకుని మైదానంలోకి రావడం విశేషం. కానీ.. ఈ ఘటనతో అంపైర్లు కొద్దిసేపు మ్యాచ్‌ని నిలిపివేశారు.
Samayam Telugu suresh raina doesnt have a place in team india but still rules his fans hearts
రైనా ఆటోగ్రాఫ్ కోసం.. ఫ్యాన్ సాహసం


భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆటోగ్రాఫ్‌ల కోసం మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ఇప్పటికే అభిమానులు వచ్చారు. కానీ.. సురేశ్ రైనా కోసం రావడం ఇదే తొలిసారి. ఉత్తరప్రదేశ్ రంజీ జట్టుకి ఆడే రైనాని అక్కడ అమితంగా ఇష్టపడతారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులో సురేశ్ రైనాకి సెలక్టర్లు చోటు కల్పించకున్నా.. అభిమానుల ఆదరణ మాత్రం తగ్గలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో 2 వికెట్ల తేడాతో గుజరాత్ ఓడిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.