యాప్నగరం

Jio Phone 5G : జియో 5జీ ఫోన్‌ ఎలా ఉంటుందంటే..! అంచనా ధర, స్పెసిఫికేషన్లు

Reliance Jio Phone 5G : తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో త్వరలో లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, అంచనా ధర, సేల్‌ వివరాలు బయటికి వచ్చాయి.

Authored byKrishna Prakash | Samayam Telugu 16 Aug 2022, 11:48 am
అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Relinace Jio) దేశంలో 5జీ నెట్‌వర్క్ (Jio 5G Network)ను అతిత్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇదే నెలలో 5జీ సర్వీస్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. మొదట మెట్రో నగరాలు, ఆ తర్వాత దేశమంతా 5జీని విస్తరించాలని జియో ప్లాన్‌ చేసుకుంది. ఈ తరుణంలోనే తక్కువ ధరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు Jio పని చేస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇప్పటికే ప్రకటించింది. జియో ఫోన్‌ నెక్స్ట్ 4జీ సక్సెసర్‌గా ఈ జియో ఫోన్‌ 5జీ (Jio Phone 5G) రానుంది. ఈ 5జీ చౌకైన మొబైల్‌కు సంబంధించిన కొన్ని విషయాలు తాజాగా బయటికి వచ్చాయి. కీలక స్పెసిఫికేషన్లు, అంచనా ధర విషయాలు లీకయ్యాయి. Reliance Jio Phone 5G Phone వివరాలు ఇవే.
Samayam Telugu JioPhone 5G launch expected price sppecifications
జియోఫోన్ (Photo: Jio)


Jio Phone 5G స్పెసిఫికేషన్లు (అంచనాల ప్రకారం)
జియో ఫోన్‌ 5జీ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ ఉంటుందని తెలుస్తోంది. 2జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. 5G ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 480 ఉంది. తక్కువ ధరలో 5జీ మొబైల్‌ను తెచ్చేందుకు జియో దీన్ని వినియోగిస్తోందని సమాచారం. ఈ ప్రాసెసర్‌ ఎనిమిది (ఆక్టా) కోర్స్‌ను కలిగి ఉంటుంది. జియోఫోన్ నెక్స్ట్‌లో ఉండే ప్రగతిఓఎస్ Jio Phone 5Gలో ఉండనుంది. రిలయన్స్ జియో కోసం గూగుల్ ఈ కస్టమ్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను రూపొందించింది.
Also Read: Independence Day Jio 3 offers : జియో మూడు సూపర్ ఆఫర్లు.. కొంతకాలమే ఛాన్స్!
6.5ఇంచుల హెచ్‌డీ+ IPS LCD డిస్‌ప్లేతో జియో ఫోన్‌ 5జీ వస్తుందని లీక్‌లు వచ్చాయి. జియో ఫోన్‌ 5జీ వెనుక రెండు కెమెరాలు ఉంటాయని సమాచారం. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండొచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రానుందని తెలుస్తోంది.

Jio Phone 5G ధర, లాంచ్జియో ఫోన్‌ 5జీ ధర రూ.12వేలలోపే ఉండే అవకాశాలు అధికం. దీంతో ఒకానొక చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌గా ఈ మొబైల్‌ ఉండనుంది. ఈఎంఐ ఆప్షన్‌ను కూడా జియో ప్రకటించే అవకాశం ఉంది. బండిల్డ్ ప్లాన్స్, డేటా ఆఫర్లు కూడా ఉండొచ్చు. ఈ ఏడాది దీపావళి సేల్‌ సందర్భంగా జియోఫోన్ 5జీ మొబైల్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. జియో కూడా ఈ ఏడాది చివరికల్లా చాలా ప్రాంతాలకు 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించాలని ప్లాన్ చేసుకున్నది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.