యాప్నగరం

త్వరలో 11 అంకెల మొబైల్ నంబర్లు!

ప్రస్తుతం మన దేశంలో 10 అంకెలుగా ఉన్న మొబైల్ నంబర్లు త్వరలో 11 అంకెలకు చేరే అవకాశాలున్నాయి. ఈ విషయమై ట్రాయ్ ఆలోచనలు ప్రారంభించింది.

Samayam Telugu 24 Sep 2019, 3:07 pm
ప్రస్తుతం మన దేశంలో మొబైల్ నంబర్ అంటే కేవలం 10 అంకెలే. కానీ త్వరలో అవి 11 అంకెలకు చేరనున్నాయని తెలుస్తోంది. ఒకప్పుడు 9 సిరీస్ లో ఉండే మొబైల్ నంబర్లు Tata DOCOMO రాకతో 8 సిరీస్ కు చేరుకుంటేనే అబ్బో అనుకున్నాం. కానీ అవి మెల్లగా 7 సిరీస్ కు, జియో రాకతో 6 సిరీస్ కు కూడా చేరుకున్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకునే నంబర్లకు కొరత ఏర్పడుతుండటంతో 11 అంకెల మొబైల్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
Samayam Telugu 11 digit mobile numbers


5G.. మనదేశంలో మరింత ఆలస్యం?.. ఎందుకిలా?

మొబైల్ నంబరింగ్ వ్యవస్థలో మరిన్ని మార్పులు చేసే అవకాశాలను కూడా ట్రాయ్ పరిశీలిస్తోంది. 9, 8, 7 సిరీస్ ల ద్వారా 210 కోట్ల మొబైల్ నంబర్లు సృష్టించే అవకాశం ఉంది. అయితే 2050 నాటికి దేశంలో దాదాపు మరో 2.6 బిలియన్ మొబైల్ నంబర్లు అవసరం అవుతాయని కొన్ని నివేదికల్లో తేలింది. పెరుగుతున్న జనాభా, వివిధ అవసరాలకు వివిధ మొబైల్ నంబర్లు ఉపయోగించే విధానం పెరగడం, ఒక్కొక్కరే రెండేసి, మూడేసి ఫోన్లు ఉపయోగిస్తూ ఉండటం దీనికి కారణం కావచ్చు.

ఈ ఫోన్లకు ఇక Whatsapp పని చేయదు.. మీ ఫోన్ ఉందేమో చూసుకోండి!

గతంలో 1993, 2003 సంవత్సరాల్లో భారతదేశంలో ఫోన్ నంబర్ల ప్రణాళికలను సమీక్షించారు. 2003 నంబరింగ్ ప్రణాళిక ప్రకారం.. 750 మిలియన్ల(75 కోట్లు) కొత్త ఫోన్ కనెక్షన్లకు నంబర్లు అందించే అవకాశం కలిగింది. ఇందులో 450 మిలియన్లు(45 కోట్లు) మొబైల్ నంబర్లు కాగా, 300 మిలియన్లు(30 కోట్లు) ల్యాండ్ లైన్ నంబర్లుగా ఉన్నాయి. కనెక్షన్ల సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరుగుతూ ఉండటంతో ప్రస్తుతం నంబర్లకు అవసరమైన వనరులు అందుబాటులో ఉండవేమో అని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. ట్రాయ్ 11 అంకెల మొబైల్ నంబర్ ను ప్రవేశపెట్టే ఆలోచన చేయడానికి ఇది కూడా ఒక కారణమే.

అయితే ఈ షాక్ మొబైల్స్ కే కాదు.. ల్యాండ్ లైన్లకు కూడా తగలనుంది. త్వరలో ల్యాండ్ లైన్ల నంబర్లు కూడా 10 అంకెలకు చేరే అవకాశం ఉంది. కేవలం డేటా ఉపయోగించే డాంగిల్ కనెక్షన్ల నంబర్లను 10 నుంచి 13 అంకెలకు పెంచడం ద్వారా 3, 5, 6 సిరీస్ నంబర్లలో కొన్ని నంబర్లను ఖాళీ చేయాలని ట్రాయ్ యోచిస్తోంది.

వన్ ప్లస్, యాపిల్ లకు పోటీగా Asus మరో ఫోన్!

ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం జనాభాలో భారత్ 2027 కల్లా చైనాను మించిపోయి ప్రపంచంలోనే ఎక్కువ జనాభా గల దేశంగా అవతరించనుంది. 2050 నాటికి మన దేశ జనాభా 164 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్యసమితి జోస్యం చెప్పింది. ప్రస్తుతం మన దేశంలో 120 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. 2050 నాటికి మన దేశంలో 328 కోట్ల మొబైల్ కనెక్షన్లు అవసరం అవుతాయని అంచనా. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న నంబర్ల వనరుల్లో 70 శాతం వినియోగించుకున్నా 2050 నాటికి 468 కోట్ల నంబర్లను అందించవచ్చని ట్రాయ్ తెలిపింది.

డిస్ట్రిబ్యూషన్ చెయిన్ లో మొబైల్ నంబర్లు బ్లాక్ అవ్వడం, నంబర్లకు కొత్త బ్లాకులు అందించడానికి కాస్త సమయం పడుతుండటం, వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా నంబర్ల వనరులను పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతున్నట్లు ట్రాయ్ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.