యాప్నగరం

India 5G Network : భారత్‌లో 5జీ నెెట్‌వర్క్ అప్పట్లోగా ప్రారంభం : కేంద్రమంత్రి

5G Services in India : దేశంలో 5జీ నెట్‌వర్క్ ప్రారంభంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాచారం వెల్లడించారు. 5జీ విషయంలో అంతా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Authored byKrishna Prakash | Samayam Telugu 16 Jun 2022, 2:01 pm
5G Services in India : ప్రస్తుతం దేశమంతా 5జీ నెట్‌వర్క్ కోసం ఎదురుచూస్తోంది. ఐదో తరం హైస్పీడ్ సర్వీస్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. వేగం ఎలా ఉంటుందనే ఆసక్తి చాలా మందిలో ఉంది. టెలికం సంస్థలు కూడా ట్రయల్స్ పూర్తి చేశాయి. తాజాగా 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వేగవంతమైన 5జీ నెట్‌వర్క్ ( 5G Network ) రాక సమీపిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఈ తరుణంలో కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ( Union IT Minister Ashwini Vaishnaw ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం ఆగస్టు - సెప్టెంబర్ మధ్య దేశంలో 5జీ నెట్‌వర్క్ మొలవుతాయని చెప్పారు. పారిస్‌లో జరుగుతున్న ఓ టెక్నాలజీ ఈవెంట్‌లో పాల్గొన్న మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.
Samayam Telugu 5జీ నెట్‌వర్క్
5G Network rollout in India


సెప్టెంబర్‌ ముగిసేలా భారత్‌లో 5జీ సేవలు ( 5G Services ) ప్రారంభమవుతాయని మంత్రి వైష్ణవ్ స్పష్టంగా చెప్పారు. “5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ నేడే ప్రారంభమైంది. జూలై ముగిసేనాటికి వేలం ప్రాసెస్ మొత్తం పూర్తవుతుంది. అదే మేం నిర్దేశించుకున్న లక్ష్యం. 5జీ కోసం కావాల్సిన మొత్తం మౌలిక సదుపాయాలను టెలికం సంస్థలు ఇప్పటికే సమకూర్చుకుంటున్నాయి” అని మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆగస్టు - సెప్టెంబర్ మధ్య 5జీ సేవలు మొదలవుతాయన్నారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం (5G spectrum auction) జూలై 26న మొదలయ్యేలా టెలికం శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, షెడ్యూల్ ప్రకారమే అంతా జరుగుతుందని మంత్రి వైష్ణవ్ కూడా స్పష్టం చేశారు.

4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 5జీ 10రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ ఇస్తుందని తెలుస్తోంది. పీఐబీ ఈ విషయాన్ని చెప్పింది. “5జీ టెక్నాలజీ బేస్ట్ సర్వీస్‌లను తెచ్చేందుకు టెలికం సర్వీస్ సంస్థలు హై, మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ వినియోగిస్తాయని అంచనా. ఇదే జరిగితే, ప్రస్తుత 4జీ సర్వీస్ ఇంటర్నెట్ కంటే 10 రెట్ల వేగం ఇచ్చే సామర్థ్యం ఉంటుంది” అని వెల్లడించింది.

మరోవైపు 5జీ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చేందుకు ప్రైవేట్ టెలికం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా సిద్ధంగా ఉన్నాయి. కొన్ని నగరాల్లో ఇప్పటికే ట్రయల్స్ నిర్వహించాయి. విభిన్నమైన టెక్నాలజీల ఆధారంగా 5జీని పరీక్షిస్తున్నాయి. దేశంలో ముందుగా 13 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమవుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాత క్రమంగా దశలవారీగా దేశమంతా 5జీ సేవలను విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.