యాప్నగరం

Airtel New Prepaid Plans : రెండు కొత్త ప్లాన్‌లను లాంచ్ చేసిన Airtel.. జియోకు పోటీగా..

Airtel New Prepaid Plans : యూజర్ల కోసం ఎయిర్‌టెల్‌ మరో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ప్రతీ రోజు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లతో పాటు అదనపు బెనిఫిట్స్‌తో వీటిని లాంచ్ చేసింది. పూర్తి వివరాలివే..

Authored byKrishna Prakash | Samayam Telugu 24 Aug 2022, 8:29 am
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ ( Airtel ) కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. రిలయన్స్ జియో (Reliance Jio) ఇటీవల కొత్త ప్లాన్‌లతో పాటు ఇండిపెండెన్స్ డే ఆఫర్లు ప్రకటించగా.. ఇప్పుడు ఎయిర్‌టెల్‌ కూడా రంగంలోకి దిగింది. జియోకు పోటీగా తన యూజర్ల కోసం కొత్తగా రెండు ప్లాన్‌లను లాంచ్ చేసింది Airtel. రూ.519, రూ.779 ధరతో ఈ ప్లాన్‌లను తీసుకొచ్చింది. మీరు ఎయిర్‌టెల్‌ యూజర్ అయితే ఈ ప్లాన్స్ ఏంటి.. పూర్తి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి. రోజువారి ఎంత ఖర్చవుతుంది.. మీకు సూటవుతాయేమో చూడండి.
Samayam Telugu Airtel New Prepaid Plans


ఎయిర్‌టెల్‌ రూ.519 ప్లాన్‌
Airtel Rs 519 Plan | ఎయిర్‌టెల్‌ కొత్త రూ.519 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 60 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. ప్రతీ రోజు 1.5జీబీ డేటా.. అంటే మొత్తంగా 90జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు. హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. రోజులో 1.5జీబీ డేటా అయిపోయాక 64kbps వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.
రూ.519 ప్లాన్‌ తీసుకుంటే ప్రతీరోజు రూ.8.65 ఖర్చవుతుంది.
Also Read: Jio : ఒక్క రీచార్జ్‌తో రెండు ప్లాన్స్, జియో 2 ఇన్ 1.. బెనిఫిట్స్ భళా!

Airtel రూ.779 ప్లాన్‌
ఈ కొత్త ప్లాన్‌ కూడా దాదాపు రూ.519నే పోలి ఉంటుంది. అయితే వ్యాలిడిటీ మాత్రమే ఎక్కువ. రూ.779 ప్లాన్‌ను తీసుకుంటే 90రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతీరోజు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు దక్కుతాయి. హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా వాడుకోవచ్చు. రోజులో 1.5జీబీ అయిపోయాక 64kbps వేగంతో డేటా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ రోజువారి ఖర్చు కూడా రూ.8.65గానే ఉంది.
అంటే ఈ కొత్త రూ.519, రూ.779 ప్లాన్స్ రెండూ ఒకే విధంగా ఉన్నాయి. రోజువారి ఖర్చు నుంచి ప్రయోజనాల వరకు సేమ్ టూ సేమ్ ఉన్నాయి. అయితే వ్యాలిడిటీ ఎక్కువ కావాలంటే రూ.779 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

మరోవైపు 5జీ నెట్‌వర్క్‌ను ఈనెలలోనే లాంచ్ చేసేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ముందుగా దేశంలోని మెట్రో నగరాల్లో 5జీ సర్వీస్‌లను ప్రారంబించనుంది ఈ సంస్థ. ఆ తర్వాత ఇతర పట్టణాలకు విస్తరించనుంది. 2024కల్లా దేశమంతా 5జీ సేవలు అందించాలని Airtel లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.

Also Read: BSNL Special Plan : బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌ లాంచ్ - 300 రోజుల వ్యాలిడిటీతో.. అప్పట్లోగానే అవకాశం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.