యాప్నగరం

BSNL 4G ఈ నగరంలో ప్రారంభమైంది.. తర్వాత ఎక్కడో తెలుసా?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మెల్లగా తన 4జీ సర్వీసులను అందించడం ప్రారంభించింది. మెల్లగా ఒక్కో నగరంలో దీనికి సంబంధించిన సేవలు ప్రారంభం అవుతున్నాయి. తర్వాత మొదలయ్యేది ఎక్కడంటే?

Samayam Telugu 24 Jan 2020, 11:14 am
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఎస్ఎన్ఎల్ 4జీ కర్ణాటకలోని మంగుళూరులో అధికారికంగా ప్రారంభమైంది. కర్ణాటకలోని నాలుగు జిల్లాల్లో ఈ సేవలు ఇప్పటికే ప్రారంభం అయింది. అయితే కర్ణాటక రాజధాని బెంగళూరులో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సేవలు బెంగళూరుకు ఆలస్యం చేయడం వెనుక ఒక కారణం ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ తన 4జీ సేవలను బెంగళూరు వంటి ఎక్కువ జనాభా కలిగిన మెట్రో నగరాల్లో ప్రారంభించటానికి ముందు చిన్న నగరాల్లో పరీక్షించాలని అనుకుంది. అందుకే మిగతా ప్రాంతాల్లో ముందుగా ప్రారంభించింది.
Samayam Telugu bsnl 4g Main


Also Read: Samsung Vs OnePlus: ఈ ధరల శ్రేణిలో అత్యుత్తమ ఫోన్లు ఇవే! మరి వీటిలో బెస్ట్ ఫోన్ ఏది?

తర్వాత ఈ సేవలు బెంగళూరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే కచ్చితంగా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయం మాత్రం తెలియరాలేదు. కర్ణాటకలోని కలబురగి, బీదర్, రాయచూర్, విజయపుర ప్రాంతాల్లో ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటిదాకా ప్రారంభం అయిన ప్రాంతాల్లో ఈ సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

Also Read: మరో లైట్ ఫోన్ ను లాంచ్ చేసిన Samsung.. ఫీచర్ల విషయంలో మళ్లీ సిక్సర్! ధర ఎంతంటే?

బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే మంగుళూరులోని 151 టవర్లను 4జీ టవర్లుగా మార్చింది. ఇంతకుముందు 3జీ సేవలు అందించడానికి ఉపయోగించిన 2,100 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రంను 4జీని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా అత్యాధునిక ఎల్900 టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ అందుబాటులో లేని ప్రదేశంలోకి వెళ్లినప్పుడు వినియోగదారులకు ఆటోమేటిక్ గా 3జీకి మారతారని బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Also Read: మీకో బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న Jio, Airtel, Vodafone టారిఫ్ లు(?).. ఎందుకో తెలుసా?

బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరలో మంచి ప్లాన్లు అందిస్తున్నప్పటికీ 4జీ సేవలు లేకపోవడం ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా 4జీని వీలైనంత త్వరగా లాంచ్ చేయాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే బీఎస్ఎన్ఎల్ 4జీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న చవకైన ప్లాన్లను దృష్టిలో పెట్టుకుంటే బీఎస్ఎన్ఎల్ 4జీని లాంచ్ చేస్తే మిగతా మొబైల్ నెట్ వర్క్ లకు గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉంది. మార్చి 2020 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్ అన్ని టెలికాం సర్కిల్‌లలో 4జీని లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే దీనికి అవసరమైన స్పెక్ట్రంను కేంద్రప్రభుత్వం అందించకపోతే ఈ సేవలు పూర్తిస్థాయిలో లాంచ్ అవ్వడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.