యాప్నగరం

దేశీయ కంపెనీ ఎలిస్తా నుంచి ప్రీమియమ్ 4K Smart TVs లాంచ్ - ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..

Elista Smart TVs launch : ఎలిస్తా బ్రాండ్ నుంచి స్మార్ట్ టీవీ లైనప్ భారత్‌లో లాంచ్ అయింది. 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్లు విడుదలయ్యాయి. 4కే రెజల్యూషన్ డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండే స్పీకర్లను కలిగి ఉన్నాయి.

Edited byKrishna Prakash | Samayam Telugu 16 Jun 2022, 5:03 pm
Elista Smart TVs : భారత్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ తయారీ సంస్థ ఎలిస్తా (Elista) నుంచి ప్రీమియమ్ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలు (LED Smart TVs) లాంచ్ అయ్యాయి. బెజిల్‌లెస్ డిజైన్, ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో మూడు డిస్‌ప్లే సైజుల్లో టీవీలను భారత మార్కెట్‌లో ఎలిస్తా విడుదల చేసింది. 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచుల స్క్రీన్ సైజ్‌లతో ఈ స్మార్ట్ టీవీలు వచ్చాయి. టీవీను వాయిస్‌ కమాండ్స్‌తో కంట్రోల్ చేసేందుకు థింక్ ఏఐ (ThinQ AI), అలెక్సా (Alexa) వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు ఉన్నాయి.
Samayam Telugu దేశీయ కంపెనీ ఎలిస్తా నుంచి ప్రీమియమ్ 4K Smart TVs లాంచ్ (Photo: Elista)
Elista Smart TVs launched in India


3840x2160 రెజల్యూషన్ ఉండే అల్ట్రా హెచ్‌డీ 4కే క్వాంటమ్ లూసెంట్ (4K Quantum Lucent) డిస్‌ప్లేలను ఈ ఎలిస్తా స్మార్ట్ టీవీలు కలిగి ఉన్నాయి. 400 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్ ఉంటుంది. 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్లలో అడుగుపెట్టిన ఈ టీవీలు వెబ్ఓఎస్‌ (WebOS)పై రన్ అవుతాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో కోసం ప్రత్యేకమైన హాట్‌కీస్ ఉండే రిమోట్ ఈ టీవీలతో పాటు వస్తుంది. వాయిస్ కమాండ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

డాల్బీ ఆడియో (Dolby Audio), హై ఫెడిలిటీ సరౌండ్ సౌండ్ ఉండే స్పీకర్లను ఈ టీవీలు కలిగి ఉన్నాయి. మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, ఆడియో జాక్, ఎథెర్‌నెట్ పోర్ట్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి. గేమింగ్ కోసం ఆటో లో ల్యాటెన్సీ మోడ్ కూడా ఉంది.

Elista Smart TVs ధర
ఎలిస్తా స్మార్ట్ టీవీ 43 ఇంచుల మోడల్ ధర రూ.48,990గా ఉంది. 50 ఇంచుల వేరియంట్ ధర రూ.59,990, 55 ఇంచుల మోడల్ ధర రూ.70,990గా ఉంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లతో పాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ టీవీలు సేల్‌కు రానున్నాయని ఆ సంస్థ వెల్లడించింది.

“భారత్‌లో స్మార్ట్ టీవీ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతోంది. అందుబాటు ధరల్లోనే అత్యుత్తమ ఎక్స్‌పీరియన్స్, బెస్ట్ టెక్నాలజీ ఉన్న టీవీలను వినియోగదారులు కోరుకుంటున్నారు. అందుకే ఆ రేంజ్‌లోనే మంచి పర్ఫార్మెన్స్‌ ఉన్న ప్రొడక్టులను తీసుకురావడంపై ప్రధానంగా దృష్టి సారించాం. అందుబాటులో ధరల్లోనే ప్రీమియమ్ ప్రొడక్టులను వినియోగదారుల కోసం తీసుకొస్తున్నాం” అని టీవీల లాంచ్ సందర్భంగా ఎలిస్తా సీఈవో పవన్ కుమార్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.