గూగుల్ పే యాప్ ద్వారా ఇప్పటిదాకా మనం నగదు బదిలీలు, బిల్ పేమెంట్స్, రీచార్జిలతోపాటు క్యాబ్, బస్ టిక్కెట్ బుకింగ్స్ను కూడా చేసుకుంటున్నాం. అయితే ఇకపై రైలు టిక్కట్లను కూడా గూగుల్ పే ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఇండియన్ రైల్వేస్తో భాగస్వామ్యం అయిన గూగుల్ ఐఆర్సీటీసీతో కలసి రైలు టిక్కెట్ బుకింగ్ సేవలను మంగళవారం (మార్చి 19) ప్రారంభించింది. అది కూడా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫాంలపై లభిస్తున్న గూగుల్ పే యాప్లో యూజర్లు ప్రస్తుతం రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే వీలుంది.
Train Ticket Booking: ఇక 'గూగుల్ పే'తో రైలు టిక్కెట్ బుకింగ్!
ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
Samayam Telugu 19 Mar 2019, 6:57 pm
ప్రధానాంశాలు:
- ఐఆర్సీటీసీతో కలిసి టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన 'గూగుల్ పే'
- బుకింగ్ కోసం ఎలాంటి చార్జిలు ఉండవు