ఒక ఇంటర్నెట్ శకం అంతం కావడానికి, మరో కొత్త యుగం ప్రారంభం కావడానికి ఇంకొన్ని రోజులే మిగిలున్నాయి. ప్రస్తుతం స్వీడన్కు చెందిన ప్యూడిపై యూట్యూబ్లో అదిపెద్ద ఛానల్గా ఉంది. ఇప్పుడు దీన్ని వెనక్కునెట్టేందుకు భారత్కు చెందిన మ్యూజిక్ కంపెనీ టి-సిరీస్ సిద్ధంగా ఉంది. కొన్ని నెలలుగా ఈ రెండు సంస్థల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. టి-సిరీస్ సబ్స్క్రైబర్ల సంఖ్య గత మూడేళ్లలో గణనీయంగా పెరిగింది. కొత్త కొత్త వీడియోలు, బాలీవుడ్ సినిమాలు, ఇండో-పాప్ ఆర్టిస్టుల మ్యూజిక్ ఆల్బమ్లను పోస్టు చేయడంతో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదేసమయంలో స్మార్ట్ఫోన్ విప్లవం, జియో ఎంట్రీ వంటి అంశాలు టి-సిరీస్ దశను మార్చేశాయి.
ప్యూడిపై సబ్స్క్రైబర్ల సంఖ్య 83,876,783గా ఉంది. ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఇంతమంది ఫ్యాన్స్ మరే ఇతర ఛానల్కు లేరు. మరోవైపు టి-సిరీస్కు 83,730,526 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇరు ఛానళ్ల మధ్య వ్యత్యాసం కేవలం 1.46 లక్షలు మాత్రమే. దీంతో మరి కొన్ని రోజుల్లో ప్యూడిపైను టి-సిరీస్ అధిగమించే అవకాశముంది.
ప్యూడిపై సబ్స్క్రైబర్ల సంఖ్య 83,876,783గా ఉంది. ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఇంతమంది ఫ్యాన్స్ మరే ఇతర ఛానల్కు లేరు. మరోవైపు టి-సిరీస్కు 83,730,526 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇరు ఛానళ్ల మధ్య వ్యత్యాసం కేవలం 1.46 లక్షలు మాత్రమే. దీంతో మరి కొన్ని రోజుల్లో ప్యూడిపైను టి-సిరీస్ అధిగమించే అవకాశముంది.