రిలయన్స్ జియో తన 5జీ ఫోన్లను అత్యంత తక్కువ ధరలో అందించనున్నట్లు తెలుస్తోంది. రూ.5 వేల ధరతో ప్రారంభమై క్రమంగా రూ.2,500-రూ.3,000 రేంజ్కు ఈ ఫోన్లు వచ్చేస్తామని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 2జీ కనెక్షన్ ఉపయోగిస్తున్న 20-30 కోట్ల మందిని లక్ష్యంగా జియో ఈ ప్రణాళికలు రూపొందిస్తుంది. జియో ఈ స్మార్ట్ ఫోన్ను రూ.5,000 కంటే తక్కువ ధరకే లాంచ్ చేస్తుందని, క్రమంగా ఈ ధరలు రూ.2,500-రూ.3,000కు తగ్గిపోతాయని పేరు తెలపడానికి ఇష్టపడని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విషయమై జియో ఇంతవరకు స్పందించలేదు. Also Read: రూ.6 వేల లోపే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన జియోనీ.. తక్కువ ధరలో మంచి ఫోన్!
మనదేశంలో ప్రస్తుతం 5జీ ఫోన్ల ధరలు రూ.27 వేల స్థాయి నుంచి అందుబాటులో ఉన్నాయి. జియో మనదేశంలో మొదటి 4జీ ఫోన్లు రూ.1,500 రీఫండబుల్ డిపాజిట్తో అందించింది. అవే మొదటి జియో ఫోన్లు. ఈ సంవత్సరం జులైలో 43వ వార్షిక సదస్సులో మనదేశాన్ని 2జీ ముక్త దేశంగా మార్చనున్నట్లు అంబానీ ప్రకటించారు. ప్రస్తుతం మనదేశంలో 35 కోట్ల మంది భారతీయులు 2జీ నుంచి ఒకేసారి 5జీకి మారే విధంగా చవకైన ధరలో ఈ ఫోన్లు లాంచ్ చేయనున్నట్లు అంబానీ తెలిపారు.
జియో ప్లాట్ఫాంల్లో 7.7 శాతాన్ని విక్రయించి రూ.33,737 కోట్ల పెట్టుబడులను సమీకరించినట్లు జియో ఇప్పటికే ప్రకటించింది. చవకైన ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ను రూపొందించడానికి గూగుల్తో కలిసి పనిచేస్తామని జియో ప్రకటించింది.
దీంతోపాటు కంపెనీ తన సొంత 5జీ నెట్ వర్క్ పరికరాలను రూపొందించుకుంటోంది. టెలికాం శాఖను స్పెక్ట్రంను కేటాయించాల్సిందిగా కూడా కోరింది. అయితే దీనిపై టెలికాం శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది.
Also Read: జియో బ్రౌజర్ వచ్చేసింది.. తెలుగు సహా ఎనిమిది భాషలకు సపోర్ట్! కీలక ఫీచర్లు ఇవే!
ప్రస్తుతానికి మనదేశంలో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించిన స్పెక్ట్రంని అందించలేదు. దీంతో టెలికాం సంస్థలన్నీ దీని కోసం వెయిటింగ్లో ఉన్నాయి. ఈ సంవత్సరం మనదేశంలో 5జీ టెస్టింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
మనదేశంలో ప్రస్తుతం 5జీ ఫోన్ల ధరలు రూ.27 వేల స్థాయి నుంచి అందుబాటులో ఉన్నాయి. జియో మనదేశంలో మొదటి 4జీ ఫోన్లు రూ.1,500 రీఫండబుల్ డిపాజిట్తో అందించింది. అవే మొదటి జియో ఫోన్లు. ఈ సంవత్సరం జులైలో 43వ వార్షిక సదస్సులో మనదేశాన్ని 2జీ ముక్త దేశంగా మార్చనున్నట్లు అంబానీ ప్రకటించారు. ప్రస్తుతం మనదేశంలో 35 కోట్ల మంది భారతీయులు 2జీ నుంచి ఒకేసారి 5జీకి మారే విధంగా చవకైన ధరలో ఈ ఫోన్లు లాంచ్ చేయనున్నట్లు అంబానీ తెలిపారు.
జియో ప్లాట్ఫాంల్లో 7.7 శాతాన్ని విక్రయించి రూ.33,737 కోట్ల పెట్టుబడులను సమీకరించినట్లు జియో ఇప్పటికే ప్రకటించింది. చవకైన ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ను రూపొందించడానికి గూగుల్తో కలిసి పనిచేస్తామని జియో ప్రకటించింది.
దీంతోపాటు కంపెనీ తన సొంత 5జీ నెట్ వర్క్ పరికరాలను రూపొందించుకుంటోంది. టెలికాం శాఖను స్పెక్ట్రంను కేటాయించాల్సిందిగా కూడా కోరింది. అయితే దీనిపై టెలికాం శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది.
Also Read: జియో బ్రౌజర్ వచ్చేసింది.. తెలుగు సహా ఎనిమిది భాషలకు సపోర్ట్! కీలక ఫీచర్లు ఇవే!
ప్రస్తుతానికి మనదేశంలో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించిన స్పెక్ట్రంని అందించలేదు. దీంతో టెలికాం సంస్థలన్నీ దీని కోసం వెయిటింగ్లో ఉన్నాయి. ఈ సంవత్సరం మనదేశంలో 5జీ టెస్టింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.