యాప్నగరం

Jio Fiber వినియోగదారులకు బంపర్ఆఫర్.. ప్రతి ప్లాన్‌పై డబుల్ డేటా.. కానీ?

భారతదేశ నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ జియో.. జియో ఫైబర్ పై కూడా డబుల్ డేటా ఆఫర్ ను ప్రకటించింది. దాని వివరాలు ఇవే!

Samayam Telugu 27 May 2020, 3:25 pm
జియో ఫైబర్ వార్షిక ప్లాన్లపై ఏకంగా డబుల్ డేటాను అందించింది. ఈ మేరకు జియో తన అధికారిక వెబ్ సైట్ లో కూడా మార్పులు చేసింది. బ్రాంజ్ ప్లాన్ నుంచి టైటానియం ప్లాన్ వరకు అన్ని ప్లాన్లపై డబుల్ డేటాను అందించనున్నారు. అయితే దీనికి వార్షిక సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంది.
Samayam Telugu Jio Fiber


Also Read: Realme X3 Seriesలో కొత్త ఫోన్ లాంచ్.. కెమెరా సూపర్!

ఉదాహరణకు మీరు బ్రాంజ్ ప్లాన్ తో వార్షిక రీచార్జ్ చేసుకుంటే మీకు 350 జీబీ డేటా లభిస్తుంది. బేస్ ప్లాన్ 100 జీబీ నెలవారీ డేటా మీకు అదనంగా లభిస్తుంది. ఒకవేళ మీరు నెలవారీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే 100 జీబీ ప్లాన్ బెనిఫిట్, 100 జీబీ లాక్ డౌన్ డబుల్ డేటా బెనిఫిట్, 50 జీబీ ఇంట్రడక్టరీ డేటా లాభాలు లభిస్తాయి. అంటే మొత్తంగా 250 జీబీ అన్నమాట. ప్రస్తుతం లాక్ డౌన్ నియమాలు క్రమంగా ఎత్తివేస్తున్నందున ఈ డబుల్ డేటా లాభాలు త్వరలో ముగియనున్నాయి.

బ్రాంజ్ ప్లాన్ తరహాలోనే.. జియో ఫైబర్ సిల్వర్ ప్లాన్ ద్వారా వార్షిక రీచార్జ్ చేసుకుంటే 800 జీబీ, గోల్డ్ ప్లాన్ ద్వారా నెలకు 1,750 జీబీ డేటా లభించనుంది. ఇక డైమండ్ ప్లాన్ ద్వారా 4000 జీబీ డేటా, ప్లాటినం ప్లాన్ ద్వారా 7500 జీబీ డేటా లభించనుంది. ఇక అన్నిటికంటే ప్రీమియం ప్లాన్ అయిన టైటానియం ప్లాన్ ద్వారా ఏకంగా 15000 జీబీ డేటాను అందించనున్నారు.

Also Read: Redmi 10x ఫోన్లు వచ్చేశాయ్.. బడ్జెట్ ధరలోనే 5జీ ఫోన్లు!

ఈ వార్షిక ప్లాన్లపై లభించే డబుల్ డేటా మీ బేస్ డేటా లాభాల ఆధారంగా లభించనుంది. ఇందులో ఉండే ఇంట్రడక్టరీ డేటా ఆరు నెలల వరకు లభిస్తుంది. అయితే ఈ డబుల్ డేటా ఆఫర్ ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు. లాక్ డౌన్ అనంతరం ఈ ఆఫర్ ను తొలగించే అవకాశం ఉంది కాబట్టి ఆసక్తి ఉన్నవారు వీలైనంత త్వరగా రీచార్జ్ చేసుకుంటే మంచిది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.