యాప్నగరం

Jio 5G : దీపావళి కల్లా జియో 5జీ జిగేల్.. అప్పటిలోగా దేశవ్యాప్తంగా.. : ముకేశ్ అంబానీ

Reliance Jio 5G launch : రిలయన్స్ జియో 5జీ లాంచ్ గురించి ప్రకటన వచ్చేసింది. రిలయన్స్ ఏజీఎం (Reliance AGM)లో జియో 5జీ లాంచ్ వివరాలను ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వెల్లడించారు.

Authored byKrishna Prakash | Samayam Telugu 29 Aug 2022, 3:58 pm
Reliance Jio 5G launch details : దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో 5జీ ( Reliance Jio 5G ) నెట్‌వర్క్‌పై క్లారిటీ వచ్చేసింది. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ( Reliance Chairman Mukesh Ambani ) ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. సోమవారం జరిగిన రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌(Reliance AGM)లో జియో 5జీ గురించి అంబానీ ప్రకటించారు. ఈ ఏడాది దీపావళి (Diwali) కల్లా అంటే అక్టోబర్ చివరినాటికి జియో 5జీ నెట్‌వర్క్‌ను లాంచ్ చేయనున్నట్టు వెల్లడించారు. ముందుగా దేశంలోని ప్రధాన మెట్రో పాలిటన్ నగరాల్లో 5జీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఆ తర్వాత దశల వారిగా మిగిలిన నగరాలకు జియో 5జీ విస్తరిస్తుందని వెల్లడించారు. రిలయన్స్ జియో 5జీ గురించి అంబానీ వెల్లడించిన విషయాలు ఇవే.
Samayam Telugu Jio 5G launch details Mukesh Ambani
Jio 5G : దీపావళి కల్లా జియో 5జీ జిగేల్.. అప్పటిలోగా దేశవ్యాప్తంగా.. : ముకేశ్ అంబానీ


రిలయన్స్ జియో ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. వాటితో పాటు హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దశల వారిగా మిగిలిన నగరాల్లోనూ 5జీని రిలయన్స్ జియో లాంచ్ చేయనుంది. 2023 డిసెంబర్‌ కల్లా దేశంలోని ప్రతీ నగరం, అన్ని తాలూకాలకు 5జీ నెట్‌వర్క్‌‌ను విస్తరిస్తామని రిలయన్స్ ప్రకటించింది. అంటే మరో 18 నెలల కాలంలో దేశమంతా 5జీ సర్వీస్‌లను అందించేందుకు రిలయన్స్ జియో ప్రణాళిక రచించుకుంది. ఏజీఎం (RIL AGM)లో వాటాదారులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. ఇంటెరాక్టివ్ మెటావర్స్ టెక్నాలజీతోనూ ఈ సమావేశం జరిగింది.

లేటెస్ట్ 5జీ వెర్షన్‌ అయిన స్టాండ్‌అలోన్ 5జీ (Standalone 5G) ని జియో తీసుకొస్తోంది. మొత్తంగా దేశమంతా 5జీ నెట్‌వర్క్ కోసం రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు అంబానీ చెప్పారు. ప్రపంచంలోనే జియో 5జీ మోస్ట్ అడ్వాన్స్డ్ 5జీ నెట్‌వర్క్ పేర్కొన్నారు.

5జీ స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో టాప్‌లో నిలిచింది. రూ.88,078కోట్లు వెచ్చించి.. అత్యధిక శాతం ఎయిర్‌వేవ్స్‌ను దక్కించుకుంది. 700మెగాహెర్ట్జ్, 800మెగాహెర్ట్జ్, 1800మెగాహెర్ట్జ్, 3300మెగాహెర్ట్జ్, 26మెగాహెర్ట్జ్ బ్యాండ్స్‌ను సొంతం చేసుకుంది.

ఆరు సంవత్సరాల క్రితం 4జీ నెట్‌వర్క్‌ను లాంచ్ చేసినప్పుడే ఎన్నో రికార్డులను జియో బద్దలుకొట్టింది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతానికి 4జీ నెట్‌వర్క్‌ను విస్తరించిన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. మంచి క్వాలిటీతో తక్కువ ధరలకే డిజిటల్ సర్వీస్‌లను అందించిన ఘనతను దక్కించుకుంది. ఇప్పుడు 5జీ నెట్‌వర్క్ లాంచ్‌కు కూడా అంతే దూకుడుతో ముందుకు సాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.