యాప్నగరం

త్వరలో జియో చవకైన ఆండ్రాయిడ్ ఫోన్లు.. చైనా కంపెనీలకు చెక్!

ప్రముఖ టెలికాం సంస్థ జియో త్వరలో చవకైన స్మార్ట్ ఫోన్లను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అందుతున్న వార్తల ప్రకారం ఇవి త్వరలో లాంచ్ కానున్నాయి.

Samayam Telugu 9 Sep 2020, 7:57 pm
రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సంస్థ జియో త్వరలో 10 కోట్ల చవకైన ఆండ్రాయిడ్ ఫోన్లను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు డేటా ప్యాక్ లతో రానున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Samayam Telugu Jio


Also Read: రెండు చవకైన స్మార్ట్ టీవీలు లాంచ్ చేసిన షియోమీ.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!

ప్రస్తుతం మనదేశంలో రిలయన్స్ జియో అత్యంత విలువైన కంపెనీగా మారింది. అత్యంత చవకైన 4జీ, 5జీ ఫోన్లను రూపొందించనున్నట్లు గతంలో జరిగిన ఏజీఎం సదస్సులో ముకేశ్ అంబానీ ప్రకటించారు. షియోమీ, ఒప్పో, రియల్ మీ, వివో వంటి చైనా బ్రాండ్లకు ఈ ఫోన్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్లు మైక్రోమాక్స్, సెల్ కాన్, కార్బన్ వంటి బ్రాండ్లను పూర్తిగా తుడిచిపెట్టేశాయి.

ప్రస్తుతం మనదేశంలో అమ్ముడుపోయే ప్రతి 10 ఫోన్లలో ఎనిమిది ఫోన్లు చైనావే కావడం విశేషం. 2017లో జియో కేవలం రూ.1,500 ధరతోనే జియో ఫీచర్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు 10 కోట్ల మంది వినియోగదారులు ఈ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు.

మనదేశంలో ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అందించడం ద్వారా వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ వంటి టెలికాం ఆపరేటర్లపై పైచేయి సాధించాలని జియో లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రస్తుతం మనదేశంలో ఇంకా కోట్లలో వినియోగదారులు కేవలం పాత ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

Also Read: మనదేశంలో కూడా లాంచ్ కానున్న పోకో ఎక్స్3.. వన్‌ప్లస్ నార్డ్‌కు గట్టిపోటీ ఖాయం!

జియో 33 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.1.52 లక్షల కోట్లను సమీకరించింది. ఫేస్ బుక్, ఇంటెల్, క్వాల్ కాం వంటి బడా సంస్థలు కూడా జియోలో పెట్టుబడులు పెట్టాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.