టీవీ బ్రాండ్ జేవీసీ జోరు మీదుంది. గత నెలలో ఆరు కొత్త స్మార్ట్టీవీలను లాంచ్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు తాజాగా మరో రెండు కొత్త హెచ్డీ ఎల్ఈడీ టీవీలను దేశీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా అదిరిపోయే సినిమాటిక్ అనుభూతిని పొందొచ్చని కంపెనీ తెలిపింది. జేవీసీ 32 అంగుళాలు, 24 అంగుళాల టీవీలను భారత్లో లాంచ్ చేసింది. స్క్రీన్ పరిమాణం మినహా రెండు టీవీల్లోనూ ఒకే రకమైన ఫీచర్లు ఉంటాయి. జీరో డాట్ ఏప్లస్ గ్రేడ్ ప్యానెల్, అల్ట్రా లుమినస్ బ్యాక్లైట్ టెక్నాలజీ కారణంగా టీవీల్లో అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ ఉంటుందని కంపెనీ తెలిపింది.
స్లిమ్ బెజెల్స్, 24 వాట్ స్పీకర్స్, డాల్బే సౌండ్, రెండు హెచ్డీఎంఐ పోర్టులు, బ్లూటూత్, రెండు యూఎస్బీ పోర్టులు వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ టీవీలను ప్రముఖ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లోనూ కొనుగోలు చేయవచ్చు. 32 అంగుళాల టీవీ ధర రూ.9,999గా, 24 అంగుళాల టీవీ ధర రూ.7,499గా ఉంది.
ఇకపోతే విదేశీ కంపెనీల రాకతో దేశీ టెలివిజన్ పరిశ్రమలో తీవ్రమైన పోటీ నెలకొంది. మరీముఖ్యంగా స్మార్ట్టీవీలకు డిమాండ్ పెరిగింది. షావోమి, థామ్సన్, ఐఫాల్కన్, జేవీసీ కంపెనీల ఎంట్రీతో టీవీల ధరలు గణనీయంగా దిగొచ్చాయి.
స్లిమ్ బెజెల్స్, 24 వాట్ స్పీకర్స్, డాల్బే సౌండ్, రెండు హెచ్డీఎంఐ పోర్టులు, బ్లూటూత్, రెండు యూఎస్బీ పోర్టులు వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ టీవీలను ప్రముఖ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లోనూ కొనుగోలు చేయవచ్చు. 32 అంగుళాల టీవీ ధర రూ.9,999గా, 24 అంగుళాల టీవీ ధర రూ.7,499గా ఉంది.
ఇకపోతే విదేశీ కంపెనీల రాకతో దేశీ టెలివిజన్ పరిశ్రమలో తీవ్రమైన పోటీ నెలకొంది. మరీముఖ్యంగా స్మార్ట్టీవీలకు డిమాండ్ పెరిగింది. షావోమి, థామ్సన్, ఐఫాల్కన్, జేవీసీ కంపెనీల ఎంట్రీతో టీవీల ధరలు గణనీయంగా దిగొచ్చాయి.