ఎందరో కళ్లు కప్పారు.. కోట్లలో నగదు దోచేశారు. కానీ వేయి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు బలైనట్లు చిన్న పాప కారణంగా దొరికిపోయారు. ఒక చిన్న పిల్ల కారణంగా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఉన్న ఏడు మోసపూరితమైన యాప్స్ను భద్రతా పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఏడు యాప్స్ ఇప్పటివరకు 5 లక్షల డాలర్లను(సుమారు రూ.3.7 కోట్లు) ఈ యాప్స్ ద్వారా సంపాదించారు. ఈ యాప్స్లో వినోదం, వాల్ పేపర్లు, మ్యూజిక్ యాప్స్కు సంబంధించిన యాడ్వేర్ స్కామ్లు జరుగుతున్నట్లు సెన్సార్ టవర్కు సంబంధించిన పరిశోధకులు తెలిపారు. Also Read: ఉచితంగా ఓటీటీ యాప్స్.. ఇంటర్నేషనల్ కాలింగ్.. జియో కొత్త ప్లాన్లు ఇవే!
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్లో ఈ మోసపూరిత యాప్స్కు సంబంధించిన యాడ్లు ప్రదర్శితం అయ్యేవి. ఈ యాప్స్ సాధారణంగా ఎవరికీ కనిపించకుండా లో ప్రొఫైల్ మెయిన్టెయిన్ చేసేవి. అయితే టిక్టాక్లో వీటి యాడ్స్ చూసిన ఒక పాప ఈ విషయమై అవాస్ట్ ‘బీ సేఫ్’ ఆన్లైన్ ప్రాజెక్టుకు దీన్ని రిపోర్ట్ చేసింది. పిల్లలు ఆన్లైన్లో ఎలా సేఫ్గా ఉండాలో ఈ కార్యక్రమం తెలుపుతుంది.
ఈ యాప్స్ యాడ్స్ను అదే పనిగా చూపిస్తూ వినియోగదారులను 2-10 డాలర్ల మధ్యలో చార్జ్ చేస్తుంది. ఈ యాప్స్ వాల్ పేపర్లు, సంగీతంతో కూడిన గేమ్స్ను అందించేవి. అయితే వీటిలో కనిపించకుండా మాల్వేర్ అందుబాటులో ఉండేది. ఈ విషయం పరిశోధకులకు తెలియగానే వారు గూగుల్కు ఈ విషయం తెలిపారు. గూగుల్ వెంటనే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్ను తొలగించింది. దీనిపై యాపిల్ ఇంతవరకు స్పందించలేదు.
ఒక్కసారి ఈ యాప్స్ మన డివైస్లో ఇన్ స్టాల్ అవ్వగానే వాటికి సంబంధించిన ఐకాన్స్ మాయం అవుతాయి. దీంతో వినియోగదారులకు వీటిని గుర్తించడం కష్టం అవుతుంది. అస్సలు ఈ యాప్స్ను ఉపయోగించకపోయినప్పటికీ ఇవి యాడ్స్ చూపించడం మాత్రం ఆపవు.
Also Read: LG Wing: ఎల్జీ రెక్కల ఫోన్ ఇదే... ధర మాత్రం చాలా తక్కువ! ఎంతంటే?
టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్స్లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్ను ప్రమోట్ చేయడం బాధాకరమైన విషయం. 5 వేల నుంచి 33 లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చిన చిన్న పాపకు అవాస్ట్ ధన్యవాదాలు తెలిపింది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్లో ఈ మోసపూరిత యాప్స్కు సంబంధించిన యాడ్లు ప్రదర్శితం అయ్యేవి. ఈ యాప్స్ సాధారణంగా ఎవరికీ కనిపించకుండా లో ప్రొఫైల్ మెయిన్టెయిన్ చేసేవి. అయితే టిక్టాక్లో వీటి యాడ్స్ చూసిన ఒక పాప ఈ విషయమై అవాస్ట్ ‘బీ సేఫ్’ ఆన్లైన్ ప్రాజెక్టుకు దీన్ని రిపోర్ట్ చేసింది. పిల్లలు ఆన్లైన్లో ఎలా సేఫ్గా ఉండాలో ఈ కార్యక్రమం తెలుపుతుంది.
ఈ యాప్స్ యాడ్స్ను అదే పనిగా చూపిస్తూ వినియోగదారులను 2-10 డాలర్ల మధ్యలో చార్జ్ చేస్తుంది. ఈ యాప్స్ వాల్ పేపర్లు, సంగీతంతో కూడిన గేమ్స్ను అందించేవి. అయితే వీటిలో కనిపించకుండా మాల్వేర్ అందుబాటులో ఉండేది. ఈ విషయం పరిశోధకులకు తెలియగానే వారు గూగుల్కు ఈ విషయం తెలిపారు. గూగుల్ వెంటనే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్ను తొలగించింది. దీనిపై యాపిల్ ఇంతవరకు స్పందించలేదు.
ఒక్కసారి ఈ యాప్స్ మన డివైస్లో ఇన్ స్టాల్ అవ్వగానే వాటికి సంబంధించిన ఐకాన్స్ మాయం అవుతాయి. దీంతో వినియోగదారులకు వీటిని గుర్తించడం కష్టం అవుతుంది. అస్సలు ఈ యాప్స్ను ఉపయోగించకపోయినప్పటికీ ఇవి యాడ్స్ చూపించడం మాత్రం ఆపవు.
Also Read: LG Wing: ఎల్జీ రెక్కల ఫోన్ ఇదే... ధర మాత్రం చాలా తక్కువ! ఎంతంటే?
టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్స్లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్ను ప్రమోట్ చేయడం బాధాకరమైన విషయం. 5 వేల నుంచి 33 లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చిన చిన్న పాపకు అవాస్ట్ ధన్యవాదాలు తెలిపింది.