ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ ఆడియో ఉత్పత్తులు, పవర్ బ్యాంకులను కూడా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త కంపెనీ స్మార్ట్ వాచ్ను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ వాచ్ గూగుల్ రూపొందించిన వేర్ఓఎస్పై పనిచేయనుంది.
ఈ వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. అలాగే వన్ ప్లస్ 8టీ లాంచ్ సందర్భంగా కంపెనీ ట్వీటర్ అకౌంట్ ద్వారా కూడా దీన్ని అధికారికంగా ప్రకటించింది. వన్ ప్లస్ ఇండియా అధికారిక పేజీలోనే ఈ ప్రకటన చేశారు.
అయితే ఇప్పుడు దీన్ని వన్ ప్లస్ సీఈవో పీట్ లా కూడా ధ్రువీకరించారు. ఈ ఫోన్ ఎప్పుడు రానుందో కూడా ఆయన తెలిపారు. కచ్చితమైన తేదీ ప్రకటించనప్పటికీ.. 2021 ప్రారంభంలో ఈ ఫోన్ రానుందని పీట్ లా పేర్కొన్నారు. ఈ వాచ్కు సంబంధించిన వివరాలు ఎప్పుడో లీకైనా... సాఫ్ట్ వేర్లో సమస్యలో లేదా ఉత్పత్తి పరమైన సమస్యలో తెలీదు కానీ దీని లాంచ్ మాత్రం ఆలస్యమైంది.
అయితే దీని కోసం మనం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. వేర్ఓఎస్ ఎకో సిస్టంను ఆండ్రాయిట్ టీవీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో కలపడం ద్వారా ఇవన్నీ మరింత మెరుగ్గా పనిచేసేందుకు గూగుల్తో తాము భాగస్వాములం అయ్యామని పీట్ లా తెలిపారు. ప్రస్తుతానికి దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని ఆయన పేర్కొన్నారు.
ఈ స్మార్ట్ వాచ్ ప్లాన్లను కంపెనీ 2016లోనే ప్రారంభించింది. అయితే మొదట స్మార్ట్ ఫోన్లపై దృష్టి సారించాలనే ఆలోచనతో దాన్ని తాత్కాలికంగా అప్పటికి పక్కన పెట్టింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ రంగంవైపు కూడా ఒక చూపు చూస్తోందని అర్థం చేసుకోవచ్చు.
ఈ వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. అలాగే వన్ ప్లస్ 8టీ లాంచ్ సందర్భంగా కంపెనీ ట్వీటర్ అకౌంట్ ద్వారా కూడా దీన్ని అధికారికంగా ప్రకటించింది. వన్ ప్లస్ ఇండియా అధికారిక పేజీలోనే ఈ ప్రకటన చేశారు.
అయితే ఇప్పుడు దీన్ని వన్ ప్లస్ సీఈవో పీట్ లా కూడా ధ్రువీకరించారు. ఈ ఫోన్ ఎప్పుడు రానుందో కూడా ఆయన తెలిపారు. కచ్చితమైన తేదీ ప్రకటించనప్పటికీ.. 2021 ప్రారంభంలో ఈ ఫోన్ రానుందని పీట్ లా పేర్కొన్నారు. ఈ వాచ్కు సంబంధించిన వివరాలు ఎప్పుడో లీకైనా... సాఫ్ట్ వేర్లో సమస్యలో లేదా ఉత్పత్తి పరమైన సమస్యలో తెలీదు కానీ దీని లాంచ్ మాత్రం ఆలస్యమైంది.
అయితే దీని కోసం మనం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. వేర్ఓఎస్ ఎకో సిస్టంను ఆండ్రాయిట్ టీవీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో కలపడం ద్వారా ఇవన్నీ మరింత మెరుగ్గా పనిచేసేందుకు గూగుల్తో తాము భాగస్వాములం అయ్యామని పీట్ లా తెలిపారు. ప్రస్తుతానికి దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని ఆయన పేర్కొన్నారు.
ఈ స్మార్ట్ వాచ్ ప్లాన్లను కంపెనీ 2016లోనే ప్రారంభించింది. అయితే మొదట స్మార్ట్ ఫోన్లపై దృష్టి సారించాలనే ఆలోచనతో దాన్ని తాత్కాలికంగా అప్పటికి పక్కన పెట్టింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ రంగంవైపు కూడా ఒక చూపు చూస్తోందని అర్థం చేసుకోవచ్చు.