యాప్నగరం

త్వరలో మళ్లీ రానున్న పబ్జీ.. స్ట్రీమర్లకు ఇప్పటికే సమాచారం?

పబ్జీ త్వరలో మనదేశంలో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీపావళికి ముందే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Samayam Telugu 7 Nov 2020, 6:30 pm
పబ్జీ మనదేశంలో మళ్లీ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. టెక్ క్రంచ్ కథనం ప్రకారం.. దీపావళి సమయంలోనే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సమాచారం అందించిన వారు తమ పేర్లను బయట పెట్టవద్దని కోరారు.
Samayam Telugu PUBG


Also Read: 64 మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్ అయిన శాంసంగ్ ఎం21ఎస్.. ధర, ఫీచర్లు ఇవే!

ఈ సమాచారం ప్రకారం పబ్జీ గ్లోబల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. చైనా సర్వర్ల విషయంలో మనదేశ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నందున భారతీయుల డేటా స్టోర్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మనదేశంలో పబ్జీ స్ట్రీమ్ చేసే హై ప్రొఫైల్ స్ట్రీమర్లకు ఈ విషయాన్ని ఇప్పటికే తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా దీనికి సంబంధించిన మార్కెటింగ్ క్యాంపెయిన్ జరిగే అవకాశం ఉంది.

చైనా కంపెనీ టెన్‌సెంట్‌తో కూడా పబ్జీ తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది. మనదేశంలో పబ్లిషింగ్ హక్కుల కోసం ఎయిర్ టెల్, పేటీయం వంటి సంస్థలతో పబ్జీ ప్రయత్నిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పబ్జీ మనదేశంలో తన సర్వర్లను అక్టోబర్ నెలాఖరులో రద్దు చేసింది.

Also Read: మోటో జీ9 పవర్ వచ్చేసింది.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

ప్లేస్టోర్‌లో నుంచి తొలగించినా ఏపీకే ఫైల్స్ ద్వారా ఈ గేమ్‌ను ఆడటం సాధ్యమైంది. అయితే దీని గురించి పబ్జీపై ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో సర్వర్లను కూడా మూసేయక తప్పలేదు. అయితే పబ్జీ నిషేధించబడినప్పటికీ కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీఫైర్‌ను ఎక్కువమంది ఆడుతున్నారు. కాబట్టి పబ్జీ తిరిగి వస్తే మునుపటి ఆదరణ లభిస్తుందో లేదో చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.