రియల్ మీ ఎక్స్ సిరీస్లో తర్వాతి తరం స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడానికి సిద్ధం అవుతోంది. అయితే కంపెనీ దీని గురించిన వివరాలను పూర్తిగా తెలపలేదు. రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ రియల్ మీ ఎక్స్ సిరీస్ ఫోన్ లాంచ్ను టీజ్ చేశారు. ఈ సిరీస్ చైనా, తైవాన్ల్లో లాంచ్ అయిన రియల్ మీ ఎక్స్7 సిరీస్ ఫోన్లే అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు రియల్ మీ రేస్ కొత్త ఫోన్ను కూడా రియల్ మీ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ను అందించనున్నట్లు సమాచారం.
తర్వాతి తరం రియల్ మీ ఎక్స్ స్మార్ట్ ఫోన్ను మాధవ్ సేథ్ ట్వీటర్ ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించిన టీజర్ వీడియోను ఆయన విడుదల చేశారు. ఈ వీడియో చివర “X is the Future” అనే ట్యాగ్ లైన్ ఉంది. దీంతో పాటు ఈ కొత్త ఎక్స్ సిరీస్ ఫోన్ వెనక భాగాన్ని చూపే ఇమేజ్ను కూడా ఆయన ట్వీట్ చేశారు. దీనిపై కంపెనీ “Dare to Leap” బ్రాండింగ్ ఉంది.
2021 ప్రారంభంలో రియల్ మీ ఎక్స్7 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ గతేడాది నవంబర్లోనే తెలిపారు. రియల్ మీ ఎక్స్7 ప్రో సపోర్ట్ పేజీ కూడా రియల్ మీ ఇండియా అధికారిక వెబ్ సైట్లో గత నెలలోనే కనిపించింది. చైనాలో ఈ ఫోన్లు రూ.20 వేల రేంజ్లోనే లాంచ్ అయ్యాయి. రెండిట్లోనూ 5జీ ఫీచర్ ఉంది.
రియల్ మీ ఎక్స్7, ఎక్స్7 ప్రో ఫోన్లు చైనాలో గతేడాది సెప్టెంబర్లోనే లాంచ్ అయ్యాయి. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లేలు, వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. రియల్ మీ ఎక్స్7లో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ను అందించగా, రియల్ మీ ఎక్స్7 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ను అందించారు. రియల్ మీ ఎక్స్7లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లే, రియల్ మీ ఎక్స్7 ప్రోలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లే అందుబాటులో ఉన్నాయి.
ఎక్స్ సిరీస్ ఫోన్లతో పాటు రియల్ మీ రేస్ అనే కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ కూడా లాంచ్కు సిద్ధం అవుతోంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ను అందించనున్నట్లు సమాచారం. ఇది మార్చిలోపే లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాటు రియల్ మీ చవకైన 5జీ ఫోన్ రియల్ మీ వీ15 5జీ కూడా మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఈ నెలలోనే చైనాలో లాంచ్ అయింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ కూడా పొందినట్లు సమాచారం.
తర్వాతి తరం రియల్ మీ ఎక్స్ స్మార్ట్ ఫోన్ను మాధవ్ సేథ్ ట్వీటర్ ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించిన టీజర్ వీడియోను ఆయన విడుదల చేశారు. ఈ వీడియో చివర “X is the Future” అనే ట్యాగ్ లైన్ ఉంది. దీంతో పాటు ఈ కొత్త ఎక్స్ సిరీస్ ఫోన్ వెనక భాగాన్ని చూపే ఇమేజ్ను కూడా ఆయన ట్వీట్ చేశారు. దీనిపై కంపెనీ “Dare to Leap” బ్రాండింగ్ ఉంది.
2021 ప్రారంభంలో రియల్ మీ ఎక్స్7 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ గతేడాది నవంబర్లోనే తెలిపారు. రియల్ మీ ఎక్స్7 ప్రో సపోర్ట్ పేజీ కూడా రియల్ మీ ఇండియా అధికారిక వెబ్ సైట్లో గత నెలలోనే కనిపించింది. చైనాలో ఈ ఫోన్లు రూ.20 వేల రేంజ్లోనే లాంచ్ అయ్యాయి. రెండిట్లోనూ 5జీ ఫీచర్ ఉంది.
రియల్ మీ ఎక్స్7, ఎక్స్7 ప్రో ఫోన్లు చైనాలో గతేడాది సెప్టెంబర్లోనే లాంచ్ అయ్యాయి. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లేలు, వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. రియల్ మీ ఎక్స్7లో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ను అందించగా, రియల్ మీ ఎక్స్7 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ను అందించారు. రియల్ మీ ఎక్స్7లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లే, రియల్ మీ ఎక్స్7 ప్రోలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లే అందుబాటులో ఉన్నాయి.
ఎక్స్ సిరీస్ ఫోన్లతో పాటు రియల్ మీ రేస్ అనే కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ కూడా లాంచ్కు సిద్ధం అవుతోంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ను అందించనున్నట్లు సమాచారం. ఇది మార్చిలోపే లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాటు రియల్ మీ చవకైన 5జీ ఫోన్ రియల్ మీ వీ15 5జీ కూడా మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఈ నెలలోనే చైనాలో లాంచ్ అయింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ కూడా పొందినట్లు సమాచారం.