దేశంలో అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో (Reliance Jio) మరింతగా దూసుకుపోతోంది. మళ్లీ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటోంది. ఇప్పటికే అత్యధిక యూజర్లతో కొనసాగుతుండగా.. మరింత వృద్ధి సాధిస్తోంది. జూన్ నెలకుగాను టెలికం సంస్థల యూజర్ల డేటాను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Telecom Regulatory Authority of India - TRAI) ప్రకటించింది. ఈ గణాంకాల్లో జియో అదరగొట్టింది. ఎయిర్టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea), బీఎస్ఎస్ఎన్ (BSNL) కంటే ఎంతో ముందు నిలిచింది. అయితే వొడాఫోన్ ఐడియాకు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. జూన్ నెలలో ఏ కంపెనీకి యూజర్లు ఎలా ఉన్నారు.. మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంత అనే వివరాలను చూడండి.
ట్రాయ్ (TRAI) రిపోర్ట్ ప్రకారం, జూన్ నెలలో రిలయన్స్ జియోకు 42లక్షల మంది యూజర్లు కొత్తగా వచ్చారు. జియో నెలవారి వృద్ధి ఏకంగా 1.03శాతంగా ఉందని ట్రాయ్ పేర్కొంది. తాజాగా కొత్త సబ్స్కైబర్లు రావడంతో జియో యూజర్ల సంఖ్య 41.30 కోట్లకు చేరింది. మొత్తంగా టెలికం రంగంలో 36 శాతం మార్కెట్ షేర్తో రిలయన్స్ జియో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
వృద్ధిపరంగా చూసుకుంటే జియో కంటే ఎయిర్టెల్ వెనుకపడింది. జూన్ నెలలో ఎయిర్టెల్కు కొత్తగా 7,93,132 మంది యూజర్లు యాడ్ అయ్యారు. దీంతో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 36.29 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఎయిర్టెల్ 31.63శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. దేశంలో రెండో అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతోంది.
పాపం.. వొడాఫోన్ ఐడియా
ఈ ఏడాది జూన్ నెలలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మాత్రమే కొత్త యూజర్లను రాబట్టుకోగలిగాయి. మరోవైవు వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) కష్టాలు కొనసాగాయి. జూన్లో వొడాఫోన్ ఐడియా 18లక్షల మంది యూజర్లను కోల్పోయిందని ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ టెలికం సంస్థ యూజర్ల సంఖ్య 25.66 కోట్లకు తగ్గిపోయింది. టెలికం రంగంలో వొడాఫోన్ ఐడియా మార్కెట్ షేర్ 22.37శాతంగా ఉంది. అత్యధిక యూజర్లు ఉన్న మూడో టెలికం సంస్థగా కొనసాగింది.
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా జూన్ నెలలో యూజర్లను పోగొట్టుకుంది. ఈనెలలో సుమారు 13లక్షల మంది సబ్స్క్రైబర్లు బీఎస్ఎన్ఎల్ను వీడినట్టు ట్రాయ్ పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య జూన్ ముగిసే నాటికి 11.15కోట్లుగా ఉంది. మార్కెట్ షేర్లో ఇది సుమారు 9.72 శాతం. అంటే ప్రైవేట్ సంస్థలు టెలికం రంగంలో 90శాతం వాటాను దక్కించుకుంటే.. ప్రభుత్వ కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రెండూ కలిపి 10శాతంతో సరిపెట్టుకుంటున్నాయి
మరోవైపు 5జీ నెట్వర్క్ లాంచ్ చేసేందుకు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సిద్ధమయ్యాయి. ఈనెలలో 5జీ సర్వీస్లను ప్రారంభించే అవకాశం ఉంది. ముందుగా మెట్రో నగరాల్లో 5జీ సర్వీస్లను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా మాత్రం 5జీ నెట్వర్క్ లాంచ్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. ప్రైవేట్ కంపెనీలు 5జీ కసరత్తుల్లో ఉంటే.. బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ట్రాయ్ (TRAI) రిపోర్ట్ ప్రకారం, జూన్ నెలలో రిలయన్స్ జియోకు 42లక్షల మంది యూజర్లు కొత్తగా వచ్చారు. జియో నెలవారి వృద్ధి ఏకంగా 1.03శాతంగా ఉందని ట్రాయ్ పేర్కొంది. తాజాగా కొత్త సబ్స్కైబర్లు రావడంతో జియో యూజర్ల సంఖ్య 41.30 కోట్లకు చేరింది. మొత్తంగా టెలికం రంగంలో 36 శాతం మార్కెట్ షేర్తో రిలయన్స్ జియో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
వృద్ధిపరంగా చూసుకుంటే జియో కంటే ఎయిర్టెల్ వెనుకపడింది. జూన్ నెలలో ఎయిర్టెల్కు కొత్తగా 7,93,132 మంది యూజర్లు యాడ్ అయ్యారు. దీంతో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 36.29 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఎయిర్టెల్ 31.63శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. దేశంలో రెండో అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతోంది.
పాపం.. వొడాఫోన్ ఐడియా
ఈ ఏడాది జూన్ నెలలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మాత్రమే కొత్త యూజర్లను రాబట్టుకోగలిగాయి. మరోవైవు వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) కష్టాలు కొనసాగాయి. జూన్లో వొడాఫోన్ ఐడియా 18లక్షల మంది యూజర్లను కోల్పోయిందని ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ టెలికం సంస్థ యూజర్ల సంఖ్య 25.66 కోట్లకు తగ్గిపోయింది. టెలికం రంగంలో వొడాఫోన్ ఐడియా మార్కెట్ షేర్ 22.37శాతంగా ఉంది. అత్యధిక యూజర్లు ఉన్న మూడో టెలికం సంస్థగా కొనసాగింది.
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా జూన్ నెలలో యూజర్లను పోగొట్టుకుంది. ఈనెలలో సుమారు 13లక్షల మంది సబ్స్క్రైబర్లు బీఎస్ఎన్ఎల్ను వీడినట్టు ట్రాయ్ పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య జూన్ ముగిసే నాటికి 11.15కోట్లుగా ఉంది. మార్కెట్ షేర్లో ఇది సుమారు 9.72 శాతం. అంటే ప్రైవేట్ సంస్థలు టెలికం రంగంలో 90శాతం వాటాను దక్కించుకుంటే.. ప్రభుత్వ కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రెండూ కలిపి 10శాతంతో సరిపెట్టుకుంటున్నాయి
మరోవైపు 5జీ నెట్వర్క్ లాంచ్ చేసేందుకు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సిద్ధమయ్యాయి. ఈనెలలో 5జీ సర్వీస్లను ప్రారంభించే అవకాశం ఉంది. ముందుగా మెట్రో నగరాల్లో 5జీ సర్వీస్లను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా మాత్రం 5జీ నెట్వర్క్ లాంచ్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. ప్రైవేట్ కంపెనీలు 5జీ కసరత్తుల్లో ఉంటే.. బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.