యాప్నగరం

రూ.351 కాదు.. రూ.199 మాత్రమే.. వివరణ ఇచ్చిన జియో!

ప్రముఖ టెలికాం సంస్థ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ అయిన జియో ఫైబర్ ప్రారంభ ప్లాన్ రూ.351 నుంచి ప్రారంభం కానుందని ఇంటర్నెట్లో వచ్చిన వార్తలను జియో ఖండించింది. జియో ఫైబర్ లాంచ్ చేసిన రోజు ప్రకటించిన రూ.699 ప్లాన్ నుంచే తమ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు ప్రారంభం అవుతాయని తెలిపింది. అయితే రూ.351 ప్లాన్ అందుబాటులో లేకపోయినా రూ.199 వీక్లీ ప్లాన్ ను జియో ప్రకటించింది.

Samayam Telugu 30 Nov 2019, 1:10 pm
ప్రముఖ టెలికాం సంస్థ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ అయిన జియో ఫైబర్ ప్రారంభ ప్లాన్ రూ.351 నుంచి ప్రారంభం కానుందని ఇంటర్నెట్లో వచ్చిన వార్తలను జియో ఖండించింది. జియో ఫైబర్ లాంచ్ చేసిన రోజు ప్రకటించిన రూ.699 ప్లాన్ నుంచే తమ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు ప్రారంభం అవుతాయని తెలిపింది. అయితే రూ.351 ప్లాన్ అందుబాటులో లేకపోయినా రూ.199 వీక్లీ ప్లాన్ ను జియో ప్రకటించింది.
Samayam Telugu reliance jio gigafiber launched rs 351 broadband plan all you need to know
రూ.351 కాదు.. రూ.199 మాత్రమే.. వివరణ ఇచ్చిన జియో!


ఎన్నో అంచనాలతో..

ప్రకటించిన రోజు నుంచే జియో ఫైబర్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి జియో ఫైబర్ వస్తే.. మిగతా బ్రాడ్ బ్యాండ్ సంస్థల మనుగడ కూడా కష్టమయ్యే పరిస్థితి నెలకొంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ జియో ఫైబర్ వచ్చేసరికి ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. మార్కెట్లో తన మీదనున్న అంచనాలను జియో ఫైబర్ అందుకోలేకపోయింది. దీంతో జియో ఫైబర్ కు ప్రజల నుంచి స్పందన కూడా అంతంత మాత్రంగానే వచ్చింది.

Also Read: Jio ఈజ్ బ్యాక్.. మరో ఉచిత ప్రకటన.. ప్రత్యర్థి కంపెనీలకు షాక్!

టెలికాం రంగం తరహాలో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకోకుండా మిగతా బ్రాడ్ బ్యాండ్ సంస్థల్లో ఒకటిగా.. గుంపులో గోవిందా తరహాలో ఉండిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ రంగం ఏదైనా తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకునే జియో సమయం వచ్చినప్పుడు మాస్టర్ ప్లాన్ ను బయటకు తీసుకువచ్చింది.

ఈ రూ.199 ప్లాన్ లో ఏం ఉన్నాయి?

ఈ ప్లాన్ సాధారణ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లాగా కంటే.. నెలవారీ ప్లాన్ డేటా నెల మధ్యలో కానీ, చివరి వారంలో కానీ అయిపోతే అప్పుడు దీని ద్వారా చేసుకుని ఈ లాభాలను పొందవచ్చు. అయితే ఈ రూ.199 ప్లాన్ ద్వారా 7 రోజుల పాటు 100 ఎంబీపీఎస్ వేగంతో అన్ లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు, టీవీ వీడియో కాలింగ్ ను కూడా ఉచితంగా పొందవచ్చు. జీఎస్టీతో కలుపుకుంటే ఈ ప్లాన్ కు చెల్లించాల్సిన మొత్తం రూ.235కు చేరుతుంది.


Also Read: Jio Vs Airtel: ఈ ఎయిర్ టెల్ ప్లాన్ల గురించి తెలిస్తే మీ జియో సిమ్ ను పక్కన పడేస్తారు!

జియో బ్రాడ్ బ్యాండ్ తో ఎన్నో లాభాలు

జియో తన బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ద్వారా ఎన్నో లాభాలను అందిస్తోంది. రూ.699 నుంచి రూ.8,499 వరకు అందించే ఈ ప్లాన్లలో వినియోగదారులకు 4K సెట్ టాప్ బాక్సులు, హోం గేట్ వే డివైసెస్, ల్యాండ్ లైన్ కనెక్షన్లను ఉచితంగా అందించనుంది. అంతేకాకుండా ప్రీమియం ప్లాన్లను ఎంచుకున్న వినియోగదారులు ఉచితంగా టీవీలను కూడా పొందవచ్చు.


Also Read: 55 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.34,999కే.. ఫ్రీగా DTH కనెక్షన్.. Xiaomi నుంచి ఖతర్నాక్ టీవీ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.