యాప్నగరం

Jio 5G : జియో 5జీ వచ్చేసింది.. ఆ 4 నగరాల్లో.. ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటా

Reliance Jio 5G : దేశంలోని నాలుగు నగరాల్లో 5జీ సర్వీస్‌లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ట్రయల్స్ కోసం బీటా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. విజయదశమి రోజున 5జీ నెట్‌వర్క్ రోల్అవుట్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా వెల్‌కమ్ ఆఫర్‌ను కస్టమర్లకు ఇస్తోంది.

Authored byKrishna Prakash | Samayam Telugu 7 Oct 2022, 4:21 pm
Reliance Jio 5G : దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో ( Reliance Jio)... 5జీ సర్వీస్‌లను ప్రారంభించింది. విజయదశమి (Vijayadashami) రోజున 5జీ సర్వీస్‌ల లాంచ్‌ను జియో మొదలుపెట్టింది. ప్రస్తుతానికి దేశంలోని నాలుగు నగరాల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్‌వర్క్‌ను జియో అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా జియో ప్రకటించింది. ఆరేళ్ల క్రితం 4జీ లాంచ్ తొలినాళ్లలో ఆన్‌లిమిటెడ్ డేటా, కాల్స్‌ను ఇచ్చిన జియో.. ఇప్పుడు 5జీ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. ప్రస్తుతానికి 4 నగరాల్లో 5జీ బీటా నెట్‌వర్క్‌ను జియో లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. జియో 5జీ లాంచ్, వెల్‌కమ్ ఆఫర్‌ గురించిన పూర్తి వివరాలు ఇవే.
Samayam Telugu jio


Jio 5G : ఈ నగరాల్లోనే..
దసరా పర్వదినమైన నేడు (అక్టోబర్ 5) నాలుగు నగరాల్లో 5జీ బీటా సర్వీస్‌లను జియో లాంచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో 5జీని అందుబాటులోకి తెచ్చింది. విజయానికి ప్రతీకగా భావించే విజయదశమి రోజున 5జీ సర్వీస్‌ల రోల్అవుట్‌ను జియో ప్రారంభించింది.

Jio 5G : టెక్నాలజీ ఇదే
5జీ స్టాండలోన్ (5G SA) నెట్‌వర్క్‌ను రిలయన్స్ జియో తీసుకొచ్చింది. 5జీకి అప్‌గ్రేడ్ అయ్యేందుకు జియో యూజర్లు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వాడుతున్న జియో సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే 5జీకి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ ఉండాలి.

Jio 5G : ఉచిత వెల్‌కమ్ ఆఫర్‌ ఇదే
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలో 5జీ నెట్‌వర్క్‌ను బీటా ట్రయల్స్ కోసం జియో అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ఆ నగరాల్లోని ఎంపిక చేసిన కస్టమర్లకు వెల్‌కమ్ ఆఫర్‌ను ఇస్తోంది. కస్టమర్లకు మెసేజ్ ద్వారా ఇన్వైట్‌ను పంపి ఈ ఆఫర్‌ను అందిస్తోంది.
5జీ వెల్‌కమ్ ఆఫర్‌ ఇన్వైట్ అందుకున్న కస్టమర్లు.. ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. 5జీ ప్లాన్‌లను ప్రకటించే వరకు ఈ వెల్‌కమ్ ప్లాన్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఏకంగా 1జీబీపీఎస్ వరకు వేగం ఉంటుందని జియో ప్రకటించింది.
దేశంలో 5జీ సర్వీస్‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారం లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో దేశంలోని 8 నగరాల్లో 5జీ సర్వీస్‌లను తొలి దశలో తీసుకొస్తున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఇప్పుడు జియో కూడా 4 నగరాల్లో 5జీ సర్వీస్‌లను ట్రయల్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.