యాప్నగరం

Jio Laptop : మరో సంచలనానికి జియో సిద్ధం.. రూ.15వేలకే 4G సిమ్‌తో జియో ల్యాప్‌టాప్‌!

JioBook Laptop : అతిత్వరలో తక్కువ ధర ల్యాప్‌టాప్‌ను రిలయన్స్ జియో లాంచ్ చేయనుంది. జియోబుక్ పేరుతో అడుగుపెట్టనుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో జియో ప్రదర్శించింది. పూర్తి వివరాలు ఇవే..

Authored byKrishna Prakash | Samayam Telugu 3 Oct 2022, 10:31 am
Jio Laptop Price, Specifications : దేశంలో టాప్ టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) మరో సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే తక్కువ ధరలో 4జీ ఫోన్‌‌ను తీసుకొచ్చిన జియో.. ఇక ల్యాప్‌టాప్‌ విభాగంపై కన్నేసింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2022 (India Mobile Congress) ఈవెంట్‌‌లో జియో తన తొలి ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. ఈ ల్యాప్‌టాప్‌కు జియోబుక్ (JioBook Laptop) అని పేరు పెట్టింది. కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లు కూడా బయటికి వచ్చాయి.
Samayam Telugu Reliance Jio to launch JioBook Laptop in India at around rs 15000 soon with 4G Sim


జియోబుక్ (JioBook) ల్యాప్‌టాప్‌ కోసం చిప్ మానుఫ్యాక్చరింగ్ సంస్థ క్వాల్‌కామ్‌తో జియో జతకట్టింది. ఈ ల్యాప్‌టాప్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ 4జీ సిమ్‌కు (JioBook 4G laptop) సపోర్ట్ చేస్తుంది. అంటే సిమ్ వేసుకొని 4జీ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవచ్చు. అయితే ఈ జియోబుక్‌ ధర అన్నింటి కంటే ఆకర్షణీయంగా ఉంది.

జియోబుక్ ల్యాప్‌టాప్‌ ధర
JioBook laptop Price : జియోబుక్ 4జీ ల్యాప్‌టాప్‌ ధర సుమారు రూ.15,000గా ఉంటుందని రాయిటర్స్ రిపోర్ట్ పేర్కొంది. ఎంట్రీ లెవెల్ స్పెసిఫికేషన్లతో వస్తుందని పేర్కొంది. తక్కువ ధరకే ఈ ల్యాప్‌టాప్‌ తెచ్చి.. ఆధిపత్యం ప్రదర్శించాలని జియో భావిస్తోంది. జియోఫోన్ విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించి సక్సెస్ అయింది. జియోఫోన్, జియోఫోన్ నెక్ట్స్ వల్ల జియోకు యూజర్లు గణనీయంగా పెరిగారు.

జియోబుక్ ల్యాప్‌టాప్‌ కోసం క్వాల్‌కామ్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌ (Microsoft)తోనూ రిలయన్స్ జియో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్‌ రన్ కానుండగా.. కస్టమైడ్జ్ విండోస్ అపరేటింగ్ సిస్టమ్ ఉండనుంది. 11.6 ఇంచుల డిస్‌ప్లే, 13 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ వస్తోందని సమాచారం.
ఈనెలాఖరుకు లేకపోతే నవంబర్ తొలి అర్ధభాగంలో జియోబుక్ ల్యాప్‌టాప్‌ అందుబాటులోకి రానుందని అంచనాలు వెలువడుతున్నాయి. పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలకు ముందుగా జియో ఈ ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తుందని తెలుస్తోంది. మూడునెలల్లో సాధారణ వినియోగదారుల కోసం సేల్‌కు తెస్తుందని అంచనా. అంటే మొత్తానికి 2022 చివరి కల్లా JioBook Laptop అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశీయంగా జియోబుక్ ల్యాప్‌టాప్‌ను తయారు చేసేందుకు కాంట్రాక్ట్ మానుఫ్యాక్చరర్ ఫ్లెక్స్‌ (Flex)తో రిలయన్స్ జియో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. 2023 మార్కెట్ కల్లా లక్షలాది ల్యాప్‌టాప్‌లను విక్రయించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.