భారతదేశంలో ఈ సంవత్సరం 5జీ నెట్వర్క్ (5G Network) విప్లవం మొదలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రముఖ టెలికం సంస్థలన్నీ దేశంలో 5జీ సేవలను (5G Service) ఈ సంవత్సరం ప్రారంభించేందుకు అన్ని ప్రణాళికలు వేసుకుంటున్నాయి. యూజర్లకు వేగవంతమైన 5జీ ఇంటర్నెట్ను అందించాలన్న ప్లాన్ రూపొందించుకున్నాయి. ఇక టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది. 5జీ నెట్వర్క్ ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న జియో (Jio).. ఇక అత్యంత చౌకైన 5జీ మొబైల్ను (5G Mobile) కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
దేశంలో 5జీ నెట్వర్క్ కవరేజ్కు సంబంధించిన ప్లానింగ్ను జియో పూర్తి చేసుకుందని, తొలిదశలో 13 నగరాల్లో 5జీని ప్రారంభిస్తుందని ఆండ్రాయిడ్ సెంట్రల్ వెల్లడించింది. ఇందులో భాగంగానే జియోఫోన్ 5జీ (JioPhone 5G) స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ జియోఫోన్ 5జీ ధర రూ.10వేలలోపే ఉండే అవకాశం ఉంది. దీంతో భారత్లో అత్యంత చౌకైన 5జీ మొబైల్ ఇదే కానుంది.
జియోఫోన్ 5జీ లీకైన స్పెసిఫికేషన్లు (JioPhone 5G Leaked Specifications)
జియోఫోన్ 5జీ (JioPhone 5G) మొబైల్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్తో వచ్చే అవకాశం ఉంది. చీపెస్ట్ 5జీ ప్రాసెసర్గా మిడ్ రేంజ్ ఫోన్లలో వస్తున్న ఈ చిప్సెట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఇక ఈ మొబైల్ N3, N5, N28, N40, N78 5జీ బ్యాండ్లు ఉండనున్నాయి. 6.5 ఇంచుల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఈ ఫోన్లో ఉండే అవకాశం ఉంది.
4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డు స్లాట్తో జియోఫోన్ 5జీ రానుంది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ 11 (Android 11) ఆపరేటింగ్ సిస్టం ఉండనుంది. జియోఫోన్ నెక్ట్స్లో ఉన్న ప్రగతి ఓఎస్ కాకుండా.. 5జీ మొబైల్లో పూర్తిస్థాయి ఆండ్రాయిడ్ ఓఎస్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఈ 5జీ ఫోన్ను వెనుక రెండు కెమెరాలతో జియో తీసుకురానున్నట్టు సమాచారం. 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుండగా.. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించే అవకాశం ఉంది. జియోఫోన్ 5జీ మొబైల్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుండగా.. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్టుతో రావొచ్చు.
అయితే 5జీ ఫోన్ను రిలయన్స్ జియో (Reliance Jio) ఎప్పుడు విడుదల చేస్తుందన్నది స్పష్టత రాలేదు. ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలో జియోఫోన్ 5జీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ రూపకల్పన దశలో ఉంది. జూన్లో ఈ ఫోన్ ప్రకటించి.. మరో మూడు నెలల కాలంలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రిలయన్స్ ప్లాన్ చేస్తోందని సమాచారం.
దేశంలో 5జీ నెట్వర్క్ కవరేజ్కు సంబంధించిన ప్లానింగ్ను జియో పూర్తి చేసుకుందని, తొలిదశలో 13 నగరాల్లో 5జీని ప్రారంభిస్తుందని ఆండ్రాయిడ్ సెంట్రల్ వెల్లడించింది. ఇందులో భాగంగానే జియోఫోన్ 5జీ (JioPhone 5G) స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ జియోఫోన్ 5జీ ధర రూ.10వేలలోపే ఉండే అవకాశం ఉంది. దీంతో భారత్లో అత్యంత చౌకైన 5జీ మొబైల్ ఇదే కానుంది.
జియోఫోన్ 5జీ లీకైన స్పెసిఫికేషన్లు (JioPhone 5G Leaked Specifications)
జియోఫోన్ 5జీ (JioPhone 5G) మొబైల్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్తో వచ్చే అవకాశం ఉంది. చీపెస్ట్ 5జీ ప్రాసెసర్గా మిడ్ రేంజ్ ఫోన్లలో వస్తున్న ఈ చిప్సెట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఇక ఈ మొబైల్ N3, N5, N28, N40, N78 5జీ బ్యాండ్లు ఉండనున్నాయి. 6.5 ఇంచుల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఈ ఫోన్లో ఉండే అవకాశం ఉంది.
4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డు స్లాట్తో జియోఫోన్ 5జీ రానుంది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ 11 (Android 11) ఆపరేటింగ్ సిస్టం ఉండనుంది. జియోఫోన్ నెక్ట్స్లో ఉన్న ప్రగతి ఓఎస్ కాకుండా.. 5జీ మొబైల్లో పూర్తిస్థాయి ఆండ్రాయిడ్ ఓఎస్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఈ 5జీ ఫోన్ను వెనుక రెండు కెమెరాలతో జియో తీసుకురానున్నట్టు సమాచారం. 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుండగా.. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించే అవకాశం ఉంది. జియోఫోన్ 5జీ మొబైల్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుండగా.. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్టుతో రావొచ్చు.
అయితే 5జీ ఫోన్ను రిలయన్స్ జియో (Reliance Jio) ఎప్పుడు విడుదల చేస్తుందన్నది స్పష్టత రాలేదు. ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలో జియోఫోన్ 5జీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ రూపకల్పన దశలో ఉంది. జూన్లో ఈ ఫోన్ ప్రకటించి.. మరో మూడు నెలల కాలంలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రిలయన్స్ ప్లాన్ చేస్తోందని సమాచారం.