యాప్నగరం

సైన్యం కోసం ‘సై’.. ప్రత్యేక మెసేజింగ్ యాప్ లాంచ్! ఏమాత్రం లోపం లేని భద్రతా ఫీచర్లు!

భారత సైన్యం కోసం మెరుగైన భద్రతా ప్రమాణాలతో కూడుకున్న మెసేజింగ్ యాప్‌ను రక్షణ మంత్రిత్వశాఖ లాంచ్ చేసింది. దీనికి ‘సై’ అని పేరు పెట్టారు.

Samayam Telugu 31 Oct 2020, 4:29 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ కింద ఇండియన్ ఆర్మీ వాట్సాప్ తరహా మెసేజింగ్ యాప్‌ను రూపొందించింది. దీనికి SAI(Secure Application for the Internet) అని పేరు పెట్టారు.
Samayam Telugu SAI


Also Read: ఎల్జీ చవకైన 5జీ ఫోన్ లాంచ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

భారత సైనికులు ఎటువంటి భద్రతా లోపాలు లేకుండా ఉపయోగించుకునే విధంగా ఈ ‘సై’ మెసేజింగ్ సర్వీస్‌ను ఉపయోగించారు. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాం మీద మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఐవోఎస్‌కి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ ఫోన్లకు టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ విషయంలో పూర్తిస్థాయి భద్రతను ఈ యాప్ అందిస్తుంది. దేశభద్రతకు సంబంధించిన రహస్య సమాచారం ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలకు చేరకుండా అడ్డుకోవడమే ఈ యాప్ లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

భారత సైన్యం అందించిన ప్రకటన ప్రకారం ఆర్మీ సైబర్ గ్రూప్, సెర్ట్-ఇన్ సంస్థ కలసి ఈ యాప్‌ను రూపొందించాయి. ఈ యాప్‌కు సంబంధించిన హక్కులను పొందే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read: మొట్టమొదటి ఫోన్ లాంచ్ చేసిన యాహూ.. ధర రూ.4 వేలలోపే!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్ తరహాలోనే ఈ యాప్ కూడా ఉంటుందని తెలిపారు. లోకల్ ఇన్-హౌస్ సర్వర్లు, కోడింగ్ వంటి వాటిని దీని భద్రత కోసం ఉపయోగించినట్లు ఇందులో తెలిపారు. సైనికులందరూ ఈ యాప్‌ను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఈ యాప్ ఎలా ఉంటుంది? ఎలా పనిచేస్తుందో తెలుసుకున్న రక్షణ మంత్రి.. ఈ యాప్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన కల్నల్ సాయి శంకర్‌ను అభినందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.