శాంసంగ్ మనదేశంలో గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. గెలాక్సీ ఏ22 4జీ మోడల్ మనదేశంలో జూన్ నెలాఖరులో లాంచ్ అయింది. 91మొబైల్స్ కథనం ప్రకారం.. ఈ ఫోన్ మనదేశంలో గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో వచ్చే నెలలో లాంచ్ కానుంది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీ తెలియరాలేదు. శాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ, ఏ22 5జీ స్మార్ట్ ఫోన్లు గత నెలలో యూరోప్లో లాంచ్ అయ్యాయి. దీని 4జీ మోడల్ మనదేశంలో ఇప్పటికే లాంచ్ కాగా, 5జీ మోడల్ వంతు ఇప్పుడు వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఏ22 4జీ ధరను మనదేశంలో రూ.18,499గా నిర్ణయించారు. ఇందులో ఒకే ఒక్క వేరియంట్ మాత్రమే ఉంది. ఆ వేరియంట్లో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ను అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ ఇండియా సపోర్ట్ పేజీ కూడా మనదేశంలో లైవ్ అయింది. ఈ ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ వెబ్ సైట్లో కనిపించింది. కాబట్టి దీని లాంచ్ త్వరలోనే ఉండనుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఫోన్ లాంచ్ అయితే 4జీ వేరియంట్ కంటే ఎక్కువ ధరతోనే లాంచ్ కానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్పెసిఫికేషన్లు
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్గా ఉండగా, 15W ఫాస్ట్ చార్జింగ్ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్పై శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ పనిచేయనుంది. 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్గా ఉంది. దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, యాక్సెలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్లను కూడా ఇందులో అందించారు. దీని మందం 0.9 సెంటీమీటర్లుగానూ, బరువు 203 గ్రాములుగానూ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ ఇండియా సపోర్ట్ పేజీ కూడా మనదేశంలో లైవ్ అయింది. ఈ ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ వెబ్ సైట్లో కనిపించింది. కాబట్టి దీని లాంచ్ త్వరలోనే ఉండనుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఫోన్ లాంచ్ అయితే 4జీ వేరియంట్ కంటే ఎక్కువ ధరతోనే లాంచ్ కానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్పెసిఫికేషన్లు
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్గా ఉండగా, 15W ఫాస్ట్ చార్జింగ్ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్పై శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ పనిచేయనుంది. 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్గా ఉంది. దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, యాక్సెలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్లను కూడా ఇందులో అందించారు. దీని మందం 0.9 సెంటీమీటర్లుగానూ, బరువు 203 గ్రాములుగానూ ఉంది.