యాప్నగరం

మీకో బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న Jio, Airtel, Vodafone టారిఫ్ లు(?).. ఎందుకో తెలుసా?

ఇప్పటికే పెరిగిన మొబైల్ టారిఫ్ లతో సతమతం అవుతున్నారా? అయితే మరో బిగ్ బాంబ్ కు సిద్ధం కండి. ఏజీఆర్ బకాయిల విషయంలో మినహాయింపు లభించకపోతే మొబైల్ టారిఫ్ లు మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉంది.

Samayam Telugu 24 Jan 2020, 12:31 am
అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ(ఏజీఆర్)పై టెలికాం సంస్థలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది. వొడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ లు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు వీటికి ఆ బకాయిల నుంచి ఎటువంటి మినహాయింపు ఇవ్వకపోవడంతో ఆర్థిక పరంగా బలం పుంజుకోవడానికి మొబైల్ నెట్ వర్క్ లు ఇప్పటికే గత నెలలో టారిఫ్ లు పెంచాయి. కానీ ఇప్పుడు ఈ రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు మళ్లీ కొట్టివేయడంతో మొబైల్ కంపెనీలు మళ్లీ టారిఫ్ లను పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి కథనాన్ని పూర్తిగా చదవండి...
Samayam Telugu this is the reason why vodafone idea airtels pain is bad news for mobile subscribers
మీకో బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరగనున్న Jio, Airtel, Vodafone టారిఫ్ లు(?).. ఎందుకో తెలుసా?


​మొబైల్ బిల్లులు మరో 25-30% పెరగవచ్చు

ప్రస్తుతం ప్రతి వినియోగదారునిపై వచ్చే సగటు ఆదాయం(ARPU) జియో రాకముందు స్థాయి కంటే తక్కువగా ఉందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ సంజీవ్ భాసిన్ ఎకనమిక్ టైమ్స్ కు తెలిపారు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉండటంతో ఈ సంవత్సరం కూడా టెలికాం సంస్థలు తమ టారిఫ్ లను 30 శాతం వరకు పెంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే వొడాఫోన్, జియో, ఎయిర్ టెల్ ల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో టారిఫ్ ల పెంపు మళ్లీ జరిగితే.. ప్లాన్ల ధరలు భారీగా పెరగవచ్చు.


Also Read: మీ బ్రౌజర్ పనితీరును మరింత వేగంగా మార్చాలనుకుంటున్నారా? అయితే ఈ ట్రిక్ మీకోసమే!

​వొడాఫోన్ ఐడియా మనుగడ పైనే భారం!

మొబైల్ టారిఫ్ ల పెంపు వొడాఫోన్ ఐడియా మనుగడపై ఆధారపడి ఉందని కొందరు నిపుణులు పేర్కొన్నారు. ఒకవేళ టెలికాం రంగంలో కేవలం జియో, ఎయిర్ టెల్ మాత్రమే ఉన్నట్లయితే ధరల పెంపు మరింత భారీగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

​వొడాఫోన్ ఏం చేస్తోంది?

వొడాఫోన్-ఐడియా ప్రస్తుతం దీనిపై ఉన్న ఆప్షన్లను వెతికే పనిలో ఉంది. ఏజీఆర్ రూలింగ్ విషయమై మార్పులను కోరుతూ వొడాఫోన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 23 నాటికి కొంత మొత్తాన్ని చెల్లించి, మిగతా మొత్తం చెల్లించడానికి మరింత సమయం కోరే ఆలోచనలో వొడాఫోన్ ఉన్నట్లు తెలిసింది. కొంత మొత్తాన్ని ముందుగా చెల్లించినట్లయితే ప్రభుత్వం కూడా వొడాఫోన్ కు మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.


Also Read: Whatsapp Beta: ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న Dark Mode వచ్చేసింది.. ఎలా యాక్టివేట్ చేయాలంటే?

​జనవరి 23 కల్లా చెల్లించాలి

ఈ మూడు టెలికాం కంపెనీలకు బకాయిలు చెల్లించడానికి సుప్రీంకోర్టు జనవరి 23 వరకు గడువిచ్చింది. టెలికాం విభాగం ప్రకారం, వొడాఫోన్-ఐడియా రూ.19,823.71 కోట్లు, ఎయిర్‌టెల్ సుమారు రూ.23,000 కోట్లు, రిలయన్స్ జియో రూ .16,456.47 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

​ARPU విషయంలో ఎంతో వెనుక!

మనదేశంలో టెలికాం విషయంలో వినియోగదారుల ఖర్చు ఎంతో తక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో సింగపూర్, మలేషియా, చైనా/హాంకాంగ్, ఫిలిప్పీన్స్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్ మన దేశంల కంటే ఎంతో ముందు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.


Also Read: Jio, Airtel, Vodafoneల్లో అత్యుత్తమ లాభాలందించే ప్లాన్లు ఇవే.. ఏది బెస్ట్?

​టారిఫ్ లు పెరిగితే సబ్ స్క్రైబర్ల సంఖ్య తగ్గే అవకాశం!

2019 డిసెంబర్‌లో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, రిలయన్స్ జియోలు దాదాపు 3 సంవత్సరాల తరువాత మొబైల్ టారిఫ్‌ను పెంచాయి. ఈ పెంపు 14 శాతం నుంచి 40 శాతం వరకు ఉంది. రాబోయే 6-9 నెలల్లో మొబైల్ టారిఫ్ లు 15 శాతానికి మించి పెరిగితే మన దేశంలో మొబైల్ చందాదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.