యాప్నగరం

ఇక పర్మినెంట్‌గా వర్క్ ఫ్రం హోం.. టెక్ దిగ్గజం కీలక నిర్ణయం!

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజ కంపెనీ ట్వీటర్ తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హెం ఇస్తున్నట్లు తెలిపింది. దాని వివరాలు ఇవే!

Samayam Telugu 13 May 2020, 12:52 pm
సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ట్వీటర్ తన ఆఫీసులను సెప్టెంబర్ నుంచి తెరుస్తామని ప్రకటించింది. అయితే లాక్ డౌన్ ముగిసినప్పటికీ తమ వినియోగదారుల్లో చాలా మంది ఇంటి వద్ద నుంచే పని చేసేలా చూస్తామని తెలిపింది.
Samayam Telugu Twitter


కరోనావైరస్ కారణంగా మొదటగా వర్క్ ఫ్రం హోం ప్రకటించిన సంస్థల్లో తమది కూడా ఒకటని ట్వీటర్ తెలిపింది. అలాగే దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని పేర్కొంది. పనిని వికేంద్రీకరణ చేసి, ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసే సామర్థ్యాన్ని ఉద్యోగుల్లో పెంపొందించడమే దీని ఉద్దేశమని ట్వీటర్ అధికార ప్రతినిధి తెలిపారు.

Also Read: Mi 10 5G వచ్చేసింది.. 108MP కెమెరా, 5జీతో.. మరి ధర ఎంతంటే?

ఇంటి నుంచి అయినా పనిచేయగలమని గత కొన్ని నెలల్లో తమ ఉద్యోగులు నిరూపించారని పేర్కొన్నారు. ఏ రకమైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అయినా సరే తమ ఇంటి నుంచే వారి బాధ్యతలు పూర్తి సామర్థ్యంతో నిర్వహిస్తున్నారని, దీంతో భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగేలా చూస్తామన్నారు.

పరిస్థితులు అన్నీ చక్కబడ్డాక మెల్లగా తమ కార్యాలయాలను తెరుస్తామని ట్వీటర్ తెలిపింది. ఆఫీసులు తెరవాలా, వద్దా అనేది పూర్తిగా తమ నిర్ణయం అని, ఎప్పుడయితే ఉద్యోగులు వెనక్కి రాగలరని భావిస్తామో అప్పుడే తమ కార్యాలయాలు తెరుచుకుంటాయన్నారు.

Also Read: మొదటి వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ లాంచ్ చేసిన షియోమీ.. మిగతా కంపెనీలకు షాక్!

అయితే సెప్టెంబర్ వరకు ఆఫీసులు తెరిచే ఉద్దేశం లేదని తెలిపారు. ఒకవేళ ఆఫీసులు తెరిచినప్పటికీ పరిస్థితులు ఇంతకు ముందులా ఉండవన్నారు. గూగుల్, ఫేస్ బుక్ కూడా తమ ఉద్యోగులకు ఈ సంవత్సరం వరకు వర్క్ ఫ్రం హోం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.