యాప్నగరం

Budget 2020: మీరు కొనుగోలు చేసే తర్వాతి స్మార్ట్ ఫోన్ ‘Made in India’ కావచ్చు?

భారతదేశంలో సెల్ ఫోన్ల తయారీ, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి త్వరలో కొత్త విధానం అమల్లోకి రానుంది. ఆ విధానం అమల్లోకి వస్తే మనదేశంలో స్మార్ట్ ఫోన్ల తయారీ విపరీతంగా పెరుగుతుంది.

Samayam Telugu 1 Feb 2020, 5:03 pm
మనదేశంలో సెల్ ఫోన్ తయారీ, ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్, సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ ను ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీ చైన్ లో భారతదేశాన్ని నిలపడానికి, ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu Budget


Also Read: ఈ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే! మీరు కొనే కొత్త ఫోన్ వీటిలోదే కావచ్చు!

దీనికి సంబంధించిన విధానాన్ని ఇప్పటికే తాను రూపొందించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. కొన్ని మార్పులు మెడికల్ విభాగంలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామన్నారు. నెట్ వర్క్ కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ప్రపంచ వ్యాల్యూ చెయిన్ లో భారతదేశాన్ని ఒక భాగం చేయనున్నామని చెప్పారు. తద్వారా మనదేశంలో పెట్టుబడులు పెరుగుతాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Also Read: Whatsappలో ఈ పనులు చేస్తున్నారా? అయితే ఏకంగా జైలుకే!

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో విపరీతమైన పోటీ నెలకొని ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో తయారీని పెంచడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించి వాల్యూ చెయిన్ లో భాగం కావాలని తెలిపారు. అంతేకాకుండా శుక్రవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో మన దేశం ఎంతో వేగంగా ముందుకు దూసుకెళుతోందని, మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని తెలిపారు.

Also Read: Jio కస్టమర్లకు గుడ్ న్యూస్.. మరో డివైస్ లాంచ్.. అదే డివైస్? ధర ఎంత?

2018-19లో మనదేశంలో రూ.4.58 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారయ్యాయి. 2014-15లో ఇది కేవలం రూ.1.9 లక్షల కోట్లు మాత్రమే. గత కొన్నేళ్లలో ప్రభుత్వం మేకిన్ ఇండియాపై దృష్టి పెట్టడం ద్వారా ఏకంగా ఇంత అభివృద్ధి జరిగింది. 2025 నాటికి ఇది రూ.26 లక్షల కోట్లకు చేరనుందని అంచనా. 2025 నాటికి మన దేశంలో 100 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 100 కోట్ల స్మార్ట్ ఫోన్లలో 60 కోట్ల ఫోన్లను ఎగుమతి చేయాలనుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.