యాప్నగరం

అందుబాటులోకి వాట్సాప్ పే... ప్రస్తుతానికి ఈ బ్యాంకుల వారికి!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మనదేశంలో పేమెంట్స్ రంగంలోకి అడుగుపెట్టింది. వాట్సాప్ పే సేవలను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది.

Samayam Telugu 17 Dec 2020, 7:26 pm
మనదేశంలో వాట్సాప్ పే అందుబాటులోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతో భారతదేశ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది.
Samayam Telugu Whatsapp pay


Also Read: 2020లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన ఫోన్లు ఇవే.. ఆ రెండు బ్రాండ్లదే డామినేషన్!

వాట్సాప్ తన వినియోగదారులను 2 కోట్ల వరకు వరకు పెంచుకునే అవకాశం ఉంది. నవంబర్ 6వ తేదీన ప్రజలు వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించుకోవచ్చని వాట్సాప్ ప్రకటించింది. డిజిటల్ ఎకానమీని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి యూపీఐ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయిని వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ పేర్కొన్నారు.

ఈ సేవల ద్వారా వినియోగదారులు నగదు పంపడం మెసేజ్ పంపినంత సులభం అవుతుందని వాట్సాప్ ఒక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు తమ కుటుంబసభ్యులకు లేదా స్నేహితులకు చాలా సులభంగా నగదు పంపించుకోవచ్చని తెలిపింది.

వాట్సాప్ ఈ పేమెంట్స్ ఫీచర్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో రూపొందించింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఈ టెక్నాలజీని 160కి పైగా బ్యాంకులు సపోర్ట్ చేస్తాయి.

Also Read: నోకియా 5.4 వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!

భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో తాము కూడా భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్‌లో బ్యాంక్ ఖాతా యాడ్ చేసుకున్నాక ఆండ్రాయిడ్, ఐఫోన్ ఏ ఆపరేటింగ్ సిస్టం నుంచి అయినా నగదు పంపవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.