యాప్నగరం

తక్కువ ధరలో ఇయర్ బడ్స్.. షాక్ ఇచ్చిన Xiaomi!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన ఇయర్ బడ్స్ ను మనదేశంలో లాంచ్ చేసింది. దాని ధర, ప్రత్యేకతలు ఇవే!

Samayam Telugu 26 May 2020, 6:25 pm
షియోమీ తన ఇయర్ బడ్స్ ను మనదేశంలో లాంచ్ చేసింది. అవే రెడ్ మీ బడ్స్ ఎస్. ఎంఐ ట్రూ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ 2 తర్వాత ఇవి మనదేశంలోకి రావడం విశేషం. వీటి ధరను రూ.1,799గా నిర్ణయించారు. ప్రజలకు ఈ టెక్నాలజీని మరింత చేరువ చేసేందుకు వీటిని మనదేశంలో విడుదల చేశారు. ఇది ప్రస్తుతం బ్లాక్ కలర్ ఆప్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.
Samayam Telugu Redmi EarBuds S


Also Read: ఫుల్ టాక్ టైం + 30 జీబీ డేటా.. రంజాన్ స్పెషల్ ప్లాన్ తెచ్చిన BSNL!

బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఫీచర్ కూడా ఇందులో ఉంది. వీటికి సంబంధించిన మొదటి సేల్ మే 27వ తేదీన జరగనుంది. అమెజాన్ ఇండియా, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్స్, ఎంఐ స్టూడియో అవుట్ లెట్స్ లో ఈ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉండనుంది. తాజాగా లాంచ్ అయిన ఎంఐ ట్రూ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ 2 ధర రూ.4,499గా ఉండగా, దీని ధర ఇంకా తక్కువగా ఉండటం విశేషం.

వీటి డిజైన్, స్టీరియో సౌండ్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఇవి రూ.4,000 ధరలో ఉండే ఇయర్ ఫోన్స్ లా ఉంటాయి. మొత్తం మూడు రకాల సిలికాన్ ఇయర్ టిప్స్ ను వీటితో అందించడం విశేషం.

Also Read: సెకనుకు 1000 హెచ్‌డీ సినిమాలు.. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్!

రెడ్ మీ ఇయర్ బడ్స్ లో 7.2 ఎంఎం డ్రైవర్లను ఉపయోగించారు. ఐపీఎక్స్4 రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా వీటిలో ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ కేవలం 4.1 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే నాలుగు గంటల పాటు పాటలు వినవచ్చు. చార్జింగ్ కేస్ తో కలిపినప్పుడు 12 గంటల వరకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న లో-లేటెన్సీ మోడ్ ద్వారా గేమ్స్ ఆడేవారు కూడా చాలా సమర్ధవంతంగా ఆడవచ్చు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇయర్ బడ్స్ లో రెడ్ మీ ఇయర్ బడ్స్ ఎస్ చవకైనవని చెప్పవచ్చు. నాయిస్, బోట్ వంటి సంస్థలకు వీటి ద్వారా షియోమీ గట్టిపోటీ ఇవ్వనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.