యాప్నగరం

Xiaomi: రెడ్‌మి ఫోన్లపై భారీ తగ్గింపు!

భారత్‌లో అమ్మకాలు ఆరంభించి ఐదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో రెడ్‌మి ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించిన చైనా 'స్మార్ట్'దిగ్గజం షావోమీ.

Samayam Telugu 9 Jan 2019, 2:58 pm
చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ కంపెనీ షావోమి తన పాపులర్ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. భారత్‌లో అమ్మకాలు ఆరంభించి ఐదేళ్లు పూర్తవుతోన్న సందర్భంగా ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ మేరకు రెడ్‌మి ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఆఫర్లలో భాగంగా రెడ్‌మి నోట్ 5 ప్రొ ఫోన్‌పై రూ.4000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇప్పటి వరకు రూ. 17,999గా ఉన్న రెడ్‌మి నోట్ 5 ప్రొ 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.13,999కి వచ్చేసింది. అలాగే రూ.15,999 ధర కలిగిన 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి నోట్ 5 ప్రొ ఇప్పుడు రూ.12,999కే లభ్యం కానుంది.
Samayam Telugu redmi note 5 pro

undefined
అలాగే ఇటీవల విడుదలై రెడ్‌మి నోట్ 6 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.2000 తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం రెడ్‌మి నోట్ 6 ప్రో 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. మరోవైపు, ఎంఐ ఎ2 స్మార్ట్‌ఫోన్‌పైనా రూ.4,501 వరకు షావోమి ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. రూ.17,499 విలువ గల ఎంఐ ఎ2 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.13,999కే లభిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.