యాప్నగరం

All in One రీచార్జ్ లపై జియో డిస్కౌంట్.. Promocodeలు ఇవే!

ఐయూసీ చార్జీలను ప్రకటించిన అనంతరం జియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి నష్ట నివారణగా ఆల్ ఇన్ వన్ ప్లాన్లపై డిస్కౌంట్లను జియో అందించనుంది.

Samayam Telugu 4 Nov 2019, 11:17 am
గత నెలలో ఐయూసీ చార్జీలను ప్రకటించిన అనంతరం భారతదేశ నంబర్ వన్ టెలికాం సంస్థ జియో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. వినియోగదారులు, నెటిజన్లు జియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ సంస్థలు జియోను వెక్కిరించేలా ప్రకటనలు చేశాయి. దీంతో ప్రారంభమైన మూడేళ్లలో తొలిసారి జియో వెనకంజ వేసినట్లు కనిపించింది. దీంతో జియో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టింది. తన రీచార్జీలపై క్యాష్ బ్యాక్ లు అందించడం ప్రారంభించింది.
Samayam Telugu Jio


Also Read: మరో నాలుగు కొత్త రీచార్జ్ ప్లాన్లు ప్రకటించిన Jio.. రూ.75 నుంచి ప్రారంభం!

తమ నెట్ వర్క్ నుంచి వేరే నెట్ వర్క్ కు కాల్ చేస్తే నిమిషానికి ఆరు పైసల చార్జీలు విధిస్తామని జియో వెల్లడించిన అనంతరం దానికి తగ్గట్లు ఉచిత నాన్ జియో నిమిషాలతో ఆల్ ఇన్ వన్ ప్లాన్లను ప్రకటించింది. రూ.222, రూ.333, రూ.444, రూ.555 ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే 1,000 నుంచి 3,000 వరకు ఉచిత నిమిషాలను జియో అందించనుంది. ఇప్పుడు తాజాగా ఇందులో ఉన్న రూ.444, రూ.555 ప్లాన్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద రూ.444 ప్లాన్ పై రూ.44, రూ.555 ప్లాన్ పై రూ.50 తగ్గింపు లభించనుంది.

Also Read: Google Pay దీపావళి స్టాంప్స్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకో తెలుసా?

ఆ డిస్కౌంట్ ఆఫర్లను పొందడానికి ఈ కింద తెలిపిన ప్రక్రియను అనుసరించండి..

❂ మీ ఫోన్ లో పేటీయం యాప్ ఓపెన్ చేయండి.

❂ అందులో మొబైల్ రీచార్జ్ పై క్లిక్ చేయండి.

❂ అక్కడ మీ మొబైల్ నంబర్, సర్వీస్ ఆపరేటర్ ను అందించిన అనంతరం కింద ఉన్న Proceed అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

❂ వెంటనే మీరు ఇంకో పేజీకి వెళ్తారు. అక్కడ రూ.444, రూ.555 ప్లాన్లలో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోండి.

❂ కింద ‘ఫాస్ట్ ఫార్వర్డ్’ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటే దాన్ని డిసేబుల్ చేయండి. అనంతరం కింద ఉన్న Proceed to Rechargeపై క్లిక్ చేయండి.

❂ అప్పుడు మీకు వెంటనే ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో కింద భాగంలో ‘Apply Promocode’ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

❂ దాని మీద క్లిక్ చేసి మీరు ప్రోమో కోడ్ ను అందించాలి. ఒకవేళ మీరు రూ.444తో రీచార్జ్ చేస్తున్నట్లయితే SHUBHP44 అనే ప్రోమోకోడ్ ను, రూ.555తో రీచార్జ్ చేస్తున్నట్లయితే SHUBHP50 అనే ప్రోమో కోడ్ ను అందించాలి. రూ.444 ప్లాన్ పై రూ.444, రూ.555 ప్లాన్ పై రూ.50 తగ్గింపు లభించనుంది. ఈ మొత్తం మీకు డిస్కౌంట్ రూపంలో కాకుండా క్యాష్ బ్యాక్ రూపంలోనే అందనుంది.

❂ అనంతరం కింద ‘Proceed to Pay’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా పేమెంట్ ను పూర్తి చేసి.. రీచార్జ్ ను పూర్తి చేయాలి.

Also Read: Rangoli, Flower స్టాంపులు కావాలా? అయితే ఇలా చేయండి!

ప్లాన్ల వివరాలు ఏవంటే..
ఈ ప్లాన్ల వివరాలను గురించి తెలపాలంటే.. రూ.444తో రీచార్జ్ చేసుకున్నట్లయితే.. మీకు రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. జియో నుంచి జియోకు అపరిమిత కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 ఉచిత నిమిషాలు అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. రూ.555 రీచార్జ్ తో రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా అందిస్తారు. జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ లో ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 3,000 ఉచిత నిమిషాలు అందించనున్నారు. అంటే మీరు వేరే నెట్ వర్క్ లకు ఎక్కువగా కాల్స్ చేస్తే ఈ ప్లాన్ మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులుగానే ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.