యాప్నగరం

కొత్త బట్టలు కొనివ్వని పేరెంట్స్.. పదో తరగతి విద్యార్థిని షాకింగ్ డెసిషన్

కొత్త బట్టలు కొనమని అడిగితే తల్లిదండ్రులు మందలించారని కూతురు అఘాయిత్యానికి ఒడిగట్టింది. పొలం వెళ్లిన సమయం చూసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Samayam Telugu 6 Aug 2021, 11:21 pm
స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని.. బర్త్‌ డే పార్టీ చేయలేదంటూ చిన్నచిన్న కారణాలకే కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులపై అలిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి విషాద ఘటన ఒకటి తెలంగాణలో చోటుచేసుకుంది. కొత్తబట్టలు కొనివ్వలేదని యువతి ఆత్మహత్యకు చేసుకున్న ఘటన వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


ఆసిఫాబాద్ జిల్లా అప్పపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య, ఉమాదేవి దంపతులకు ఒక కుమారుడు, కూతురు శిరీష(15) ఉన్నారు. పదో తరగతి చదువుతున్న శిరీష రెండు రోజుల కిందట తల్లిదండ్రులను అడిగింది. ఇంట్లో పరిస్థితి బాలేక రెండు రోజుల తర్వాత కొనుక్కుందామని చెప్పినా బాలిక పట్టించుకోలేదు. దీంతో తల్లి తీవ్రంగా మందలించడంతో బాలిక మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిపోయిన తర్వాత అఘాయిత్యానికి పాల్పడింది. ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్ప్రత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.