ఆయనకు 73... ఆమెకి 26.. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి
ఇద్దరు వదువరులు. ఆయనకు 73 ఏళ్ళు, ఆమెకు 26 ఏళ్ళు ఇద్దరికి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం. అయిన మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవలనుకున్నారు. ఇరు కుటుంబీకులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దగ్గరుండి మరి పెళ్లి చేశారు
Samayam Telugu 14 Oct 2021, 1:45 pm
ప్రధానాంశాలు:
- నిర్మల్ జిల్లాలో ప్రేమ పెళ్లి
- వరుడికి 73, వధువుకి 26 ఏళ్లు
- పెద్దలను ఒప్పించి ప్రేమపెళ్లి
ఆయనకు 73 ఏళ్ళు, ఆమెకు 26 ఏళ్ళు. ఇద్దరి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం. అయినా మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబపెద్దలకు చెప్పడంతో ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా దగ్గరుండి ఘనంగా పెళ్లి జరిపించారు. ఈ వివాహం నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగామ్ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చింతకుంట తండా కు చెందిన రాథోడ్ కిషన్(73) ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. అందరికి పెళ్లిళ్లు కావడంతో వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. కిషన్ భార్య కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. మరోవైపు కుభీర్ మండలం రంజని తండాకు చెందిన సునీత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈమెకు ఒక పాప ఉంది. కూలిపని చేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది.
ఇటీవల బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్, సునీత పరిచయం అయ్యారు. మాటల సందర్భంగా తమ కష్టాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తమ కుటుంబాల్లో చెప్పగా అందరూ అంగీకరించారు. భైంసా మండలం దేగామ్ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో వివాహం జరిపించారు. ఈ పెళ్లికి గ్రామస్తులు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఇటీవల బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్, సునీత పరిచయం అయ్యారు. మాటల సందర్భంగా తమ కష్టాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తమ కుటుంబాల్లో చెప్పగా అందరూ అంగీకరించారు. భైంసా మండలం దేగామ్ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో వివాహం జరిపించారు. ఈ పెళ్లికి గ్రామస్తులు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు.