యాప్నగరం

ఆసిఫాబాద్: రెండు లారీలు ఢీ.. వాహనాల్లోనే ఇద్దరు డ్రైవర్లు మృతి

ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు ప్రమాద స్థలంలోనే మృతి చెెందారు. అయితే అతి వేగమే యాక్సిడెంట్ జరగడానికి కారణంగా తెలుస్తోంది.

Samayam Telugu 19 May 2021, 8:46 am
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాల్లోనే డ్రైవర్లు దుర్మరణం చెందారు. రెబ్బన మండలం గోలేటి క్రాస్‌ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


లారీలు ఢీకొన్న వేగానికి ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. డ్రైవర్ల మృతదేహాలు క్యాబిన్‌లలో ఇరుక్కుపోవడంతో అతికష్టం మీద వారిని బయటకు తీశారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.