యాప్నగరం

కూరగాయలమ్మే లేడీపై కన్ను.. నెల రోజుల నిఘా.. అంత శ్రద్ధతో ఏం చేశారో తెలిస్తే అవాక్కే

నెల రోజులుగా కూరగాయలమ్మే మహిళా వ్యాపారిపై నిఘా పెట్టారు. ఆమె లావాదేవీలను గమనించారు. అంత శ్రద్ధగా గమనించింది ఏ వ్యాపారం నేర్చుకోవడానికో.. లేక ఆమెపై అనుమానంతోనో కాదు.. అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

Samayam Telugu 11 Nov 2021, 3:31 pm
మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన చునార్కర్ దేవరాజ్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన చునార్కర్ శంకర్ వరుసకు అన్నదమ్ములు. కూలీ పనులు చేసుకుని జీవించే సోదరులు ఈజీ మనీకి అలవాటుపడ్డారు. చోరీలు చేయడం మొదలుపెట్టారు. కాగజ్‌నగర్‌‌లోని ఇందిరా మార్కెట్‌లో కూరగాయల వ్యాపారం చేసే ప్రమీలపై శంకర్ కన్నుపడింది. ఆమెను నెల రోజుల పాటు గమనించిన శంకర్ పూర్తి వివరాలు సేకరించి సోదరుడు దేవరాజ్‌కి చేరవేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
market


ఈ నెల 7వ తేదీన కూరగాయాల వ్యాపారి ప్రమీల హోల్‌సేల్ వ్యాపారికి చెల్లించేందుకు నగదుతో బయలుదేరడం గమనించిన కేటుగాళ్లు అదను చూసి ఆమె బుట్ట చేతపట్టుకుని పరారయ్యారు. ఆమె కూరగాయలు కొనుగోలు చేస్తున్న సమయంలో అనుమానం రాకుండా బుట్టతో చెక్కేశారు. బుట్ట కనిపించకపోవడంతో కంగారుపడిన ప్రమీల వెంటనే ఖాకీలను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితులపై గతంలోనూ చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అయితే నిందితులను అరెస్టు చేయడంతో ఆసిఫాబాద్‌లో జరిగిన మరో దొంగతనం కేసు మిస్టరీ కూడా వీడింది. ఆసిఫాబాద్‌లో మహిళ వద్ద రూ.60 వేలు కొట్టేసినట్లు తేలింది. నిందితుల నుంచి రూ.4.71 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పాత దొంగతనం కేసుకు సంబంధించి రూ50 వేలు రికవరీ చేయడం విశేషం.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.