యాప్నగరం

బాసర ఐఐఐటీలో ధర్నాకు దిగిన 8 వేల మంది విద్యార్థులు.. సీఎం రావాలంటూ..

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ ఐటీ మెయిన్ ఆఫీస్ ముందు 8 వేల మంది బైఠాయించి ‘వి వాంట్ జస్టిస్..’ అంటూ నినాదాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ యూనివర్సిటీని సందర్శించే వరకు ధర్నా ఆపేది లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 14 Jun 2022, 2:53 pm
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టారు. నిత్యం సమస్యలతో విసిగి వేసారిపోయామని.. ఎన్ని సార్లు చెప్పిన అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన కార్యాలయం ముందు 8 వేల మంది బైఠాయించి ‘వి వాంట్ జస్టిస్..’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్సిటీని సందర్శించే వరకు ధర్నా ఆపేది లేదని విద్యార్థులు అంటున్నారు. క్యాంపస్‌కు రెగ్యులర్ వైస్ చాన్సలర్‌ను నియమించాలని, పర్మినెంట్ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, విద్యార్థులకు ల్యాప్‌టాప్ యూనిఫామ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Samayam Telugu Basara IIIT



అలాగే తాగునీటితో పాటు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉదయం నుంచి వారు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు ఆందోళన విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు క్యాంపస్ ఆవరణలో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. విద్యార్థులకు మద్దతుగా బీఎస్పీ నాయకులు మద్దతు ఇస్తూ కళాశాల వద్దకు చేరుకొని గేటు వద్ద ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అక్కడ భారీ ఎత్తున మోహరించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.