యాప్నగరం

Basara IIIT: ఏడో రోజుకు చేసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన.. అర్ధరాత్రి జరిపిన చర్చలు విఫలం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గత రాత్రి జరిపిన చర్చలు విఫలం కావడంతో తమ నిరసనలను శాంతియుతంగా కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. ఎప్పటిలాగే మెయిన్ గేట్ ముందు బైఠాయించి నిరసనలకు దిగుతున్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 20 Jun 2022, 9:01 am
బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. 12 డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు ఆందోళన చేపడుతుండగా పలు దఫాలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు వారితో చర్చలు జరిపారు. అయినా డిమాండ్ల పరిష్కారానికి స్పష్టమైన హామీ రాకపోవడంతో సోమవారం ఏడో రోజు మెయిన్ గేటు వద్ద విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
Samayam Telugu Basara students protest


విద్యార్థులతో గత అర్ధరాత్రి కలెక్టర్, అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆందోళన విరమించాలని కలెక్టర్ సూచించారు. అయితే విద్యార్థులు లిఖిత పూర్వక హామీ కావాలని పట్టుబట్టారు. మంత్రులతో అర్ధరాత్రి హామీ ఇప్పించడం ఇబ్బందికరమని అధికారులు వారికి చెప్పారు. అర్ధరాత్రి చర్చలకు లేని ఇబ్బందులు హామీకి ఏం అడ్డు వస్తుందని విద్యార్థులు ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే విద్యార్థులు వినకపోవడంతో కలెక్టర్, అధికారులు వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు యథావిధిగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వంతో విద్యార్థుల చర్చలు సఫలమంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారిక ప్రకటన చేయగా.. చర్చలు విఫలమయ్యాయంటూ విద్యార్థులు ఆందోళనను కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘మాకు మీ మీద నమ్మకం లేదు..’ అంటూ మంత్రి‌ ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి‌ సబితల కామెంట్లపై విద్యార్థులు ట్వీట్ చేశారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.