యాప్నగరం

Mancherial: కానిస్టేబుల్‌ను పొట్టనబెట్టుకున్న ఎండలు.. జాగ్రత్తగా ఉండండి!

Telangana Weather Updates: తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూసిస్తున్నాడు. బండలు పగిలే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి గాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఎండవేడిమి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 15 May 2023, 12:48 pm

ప్రధానాంశాలు:

  • రాష్ట్రంలో భానుడి భగభగలు
  • అల్లాడుతున్న ప్రజలు
  • వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu telangana heat wave
ఎండదెబ్బకు కానిస్టేబుల్ మృతి
Telangana Heat Wave: తెలంగాణలో భిన్న వాతవారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మెున్నటి వరకు అకాల వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తగా.. తాజాగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఠారెత్తిస్తున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా.. మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. లక్షిట్‌పేటకు చెందిన ముత్తు సంతోష్ రామకృష్ణపూర్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 2000 బ్యాచ్‌కు చెందిన సంతోష్ రెండ్రోజుల క్రితం ఒడదెబ్బకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి సంతోష్ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది. ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండగా.. వచ్చే ఐదు రోజులు ఎండ తీవ్రత మరింత పెరుగుంతని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే ఐదు రోజులు టెంపరేచర్ సాధారణంతో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది అధికారులు తెలిపారు. ఈనెల 15 నుంచి 19 వరకు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. అదే సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఆదివారం నల్లగొండలో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్‌లో అత్యల్పంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఆదిలాబాద్‌లో 42.5 డిగ్రీలు, భద్రాచలంలో 40.2, , హకీంపేట్‌లో 40, దుండిగల్‌లో 39.9, హనుమకొండలో 40.5, హైదరాబాద్‌లో 39.7, ఖమ్మంలో 39.6 నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్నారులతో పాటు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. వేడి గాల్పుల ప్రాంతంలో కాకుండా చల్లని గాలి వచ్చే ప్రాంతంలో ఉండాలని.. మంచినీరు ఎక్కువగా తాగాలని చెబుతున్నారు.

లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలని చెబుతున్నారు. బయటకు వస్తే తలను ఏదానా వస్త్రం లేదా టోపీతో కప్పుకోవాలని, అవసరమైతే గొడుగు ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఒంటి వేడిమిని తగ్గించే లస్సీ, నిమ్మకాయ రసం, మజ్జిగ, రాగి జావ వంటి లిక్వడ్ ఫుడ్ వాటిని తీసుకుంటే మంచిదని అంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నందున అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.