యాప్నగరం

ఊరి అవతల సర్పంచ్.. చెట్టు కింద మంచం వేసి

జిల్లాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు. మరికొన్ని చోట్ల కరోనా సోకిన వారు ఊరిలో ఉండకుండా ఊరవతల ఉంటూ.. క్వారంటైన్ పాటిస్తున్నారు.

Samayam Telugu 18 Apr 2021, 11:59 am
తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. పట్టణాలు పల్లెలు అని తేడా లేకుండా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి టెన్షన్ నెలకొంది. దీంతో కొందరు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. కరోనా వచ్చిన కొందరు తమకు తాముగా ఊరు వదిలి వేరేగా ఉంటున్నారు. తమ వల్ల గ్రామంలో వేరే వాళ్లు ఎవరూ ఇబ్బంది పడకూడదని ఊరి చివర్లో మంచాలు ఏర్పాటు చేసుకొని పగలంతా అక్కడే ఉంటున్నారు.
Samayam Telugu ఊరి అవతలకు కరోనా పేషంట్లు


ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా రోగులు పగటి పూట ఊరవతల ఉన్న రావి చెట్టు కింద ఉంటున్నారు. మంచాలు ఏర్పాటు చేసుకొని భౌతిక దూరం పాటిస్తూ... కూర్చుంటున్నారు. అయితే రాత్రి కాగానే ఇళ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదుల్లో పడుకుంటున్నారు. కరోనా రోగుల్లో సాంగిడి సర్పంచ్, వార్డు సభ్యులూ సైతం ఉన్నారు. ఊరిలో ఎవరికైనా కరోనా సోకితే ఇలా స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని గ్రామ పెద్దలు సైతం చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.