యాప్నగరం

Nirmal: అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం.. భైంసాలో ఉద్రిక్తం, బస్సులపై రాళ్లు

భైంసాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ధ్వంసం ఘటన తీవ్ర కలకలం రేపింది. దళిత సంఘాలు రోడ్డెక్కి ఆందోళనకు దిగాయి. కొందరు యువకులు రెచ్చిపోయి బస్సులపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Samayam Telugu 24 Oct 2021, 6:09 pm
నిర్మల్ జిల్లా భైంసాలో మరోమారు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. దుండగులు రాడ్లతో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఒక చేయి పూర్తిగా విరిగిపోయి ఇనుపచువ్వలు బయటపడ్డాయి. విగ్రహ ధ్వంసం ఘటనతో పట్టణంలో అలజడి రేగింది.
Samayam Telugu భైంసాలో దళిత సంఘాల ఆందోళన
bhainsa


దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. రాజ్యాంగ్ నిర్మాతకు ఘోర అవమానం జరిగిందని.. దుండగులపై కఠిన చర్యలు తీసుకువాలంటూ రోడ్డెక్కారు. దళిత యువకుల జై భీం నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కొందరు యువకులు రెచ్చిపోయి ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్వారు. సూపర్ లగ్జరీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.