యాప్నగరం

Nirmal: విహారయాత్రలో స్కూల్ బస్సుకు కరెంట్ షాక్.. బస్సులో 56 మంది చిన్నారులు

Nirmal: విహార యాత్రకు వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 64 మంది చిన్నారులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే.. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు మాత్రం గాయాలయ్యాయి. కాగా.. మిగతా పిల్లలకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవ్వరికీ పెద్దగా గాయాలు కాకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 1 Dec 2022, 8:29 pm

ప్రధానాంశాలు:

  • విహారయాత్రలో ప్రైవేట్ స్కూల్ బస్సుకు కరెంట్ షాక్
  • ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 64 మంది
  • ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bus
Nirmal: విహారయాత్ర (Excursion) కు వచ్చి తిరుగు ప్రయాణమైన ఓ ప్రైవేట్ స్కూల్ (Private School) బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది. బస్సుకు విద్యుత్ తీగలు (Electric Wires) తగలటంతో.. కరెంట్ షాక్ (Electric shock) కొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 64 మంది చిన్నారులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో 56 మంది చిన్నారులే ఉన్నారు. అయితే.. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థును హుటాహుటిన ఆస్రత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను స్కూల్ యాజమాన్యం.. బాసరకు విహారయాత్రకు తీసుకొచ్చింది. అయితే.. ఎంతో ఉత్సాహంగా వచ్చిన పిల్లలు అమ్మవారిని దర్శించుకుని చాలా సంతోషంగా పిక్నిక్‌ను ఎంజాయ్ చేశారు. ఇక్కడి వరకు విహారయాత్ర అంతా సవ్యంగానే సాగింది.
అయితే.. తిరుగు ప్రయాణం అయిన సమయంలో.. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలో ఉన్న సాయిబాబాను దర్శించుకునేందుకు ఆలయం వద్దకు బస్సును పోనిచ్చారు. ఈ క్రమంలోనే బస్సుకు విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో.. ఒక్కసారిగా బస్సు అంతా విద్యుత్ షాక్ వచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. గాయాలైనా చిన్నారులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎవ్వరూ తీవ్ర గాయాలు కానీ.. ప్రాణహాని గానీ కాకపోవటంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అప్రమత్తం కావటంతో.. పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.